విషాదం.. ద్విచక్రవాహనం పేలి నలుగురు మృతి

author img

By

Published : Dec 7, 2021, 4:42 PM IST

Motorcycle explosion

Motorcycle explosion: ద్విచక్రవాహనం పేలి నలుగురు మరణించారు. మరో నలుగురు గాయపడ్డారు. ఈ ఘటన ఇరాక్​లోని బస్రా నగరంలో జరిగింది.

Motorcycle explosion: ఇరాక్​లో ద్విచక్రవాహనం పేలిన ఘటనలో నలుగురు మరణించగా.. మరో నలుగురు గాయపడ్డారని అధికారులు తెలిపారు. ఇరాక్‌లోని దక్షిణాది నగరమైన బస్రాలో ఈ పేలుడు సంభవించింది. దీంతో పరిసరాల్లో దట్టమైన పొగ అలుముకుంది.

తొలుత ఈ పేలుడును కారు బాంబుగా భావించారు. అయితే బస్రా గవర్నర్​ అసద్​​ అల్​ ఇదానీ మోటారుసైకిల్​ పేలిందని విలేకరుల సమావేశంలో తెలిపారు. అనంతరం.. రెండు కార్లకు మంటలు వ్యాపించాయని పేర్కొన్నారు.

మోటార్​సైకిల్‌కు బాంబు అమర్చారా? లేదా ఆత్మాహుతి దాడి జరిగిందా? అన్నది తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: Latakia Port Attack: సిరియా నౌకాశ్రయంపై ఇజ్రాయెల్​ ​క్షిపణి దాడి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.