22 మందితో వెళ్తూ విమానం మిస్సింగ్.. పావు గంట ప్రయాణం కోసం ఎక్కితే...

author img

By

Published : May 29, 2022, 11:03 AM IST

Updated : May 29, 2022, 12:15 PM IST

Tara Airlines

11:01 May 29

22 మందితో వెళ్తున్న విమానం ఆచూకీ గల్లంతు

నేపాల్​కు చెందిన తారా ఎయిర్​లైన్స్​ 9 ఎన్​ఏఈటీ ట్విన్​ ఇంజిన్​ విమానం ఆచూకీ గల్లంతైంది. విమానంలో ముగ్గురు సిబ్బందితో పాటు 19 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. పఖోరా నగరం నుంచి కొండ ప్రాంత పట్టణం జోమ్సోమ్​కు 15 నిమిషాల ప్రయాణం కోసం గాల్లోకి ఎగిరిన కాసేపటికే.. ఉదయం 9.55 గంటల ప్రాంతంలో విమానంతో సంబంధాలు తెగిపోయాయన్నారు.

"ట్విన్​ ఇంజిన్​ ఎయిర్​క్రాఫ్ట్​ విమానం ఆచూకీ లభించలేదు. గాలింపు చర్యలు చేపట్టాం. కొద్ది రోజులుగా ఆ ప్రాంతంలో వర్షాలు పడుతున్నాయి. కానీ, విమానాలు సాధారణంగానే తిరుగుతున్నాయి. కొండలను దాటుకుని వెళ్లాల్సి ఉంటుంది. ఆ ప్రాంతానికి విదేశీ ట్రెక్కర్లు ఎక్కువగా వస్తుంటారు. అలాగే.. ముక్తినాథ్​ ఆలయాన్ని సందర్శించేందుకు భారత్​, నేపాలీ భక్తులు పర్యటిస్తారు."

- రమేశ్​ తాపా, పోలీసు అధికారి.

19 మంది ప్రయాణికుల్లో నలుగురు భారతీయులు, ముగ్గురు జపాన్​ దేశస్థులు ఉన్నారు. మిగిలినవారు నేపాలీలు. సిబ్బందితో కలిపి విమానంలో మొత్తం 22 మంది ఉన్నట్లు ఆ దేశ మీడియా తెలిపింది. ఆచూకీ గల్లంతైన విమానాన్ని వెతికేందుకు రెండు హెలికాప్టర్లను రంగంలోకి దింపింది నేపాల్​ హోంశాఖ. ముస్టాంగ్​, పోఖరా నుంచి ఇవి గాలింపు చర్యల్లో పాల్గొన్నట్లు తెలిపింది. మరోవైపు.. నేపాల్​ ఆర్మీ చాపర్​ ఎంఐ-17 సైతం మోహరించినట్లు తెలిపారు హోంశాఖ ప్రతినిధి ఫదింద్ర మని​. సంబంధాలు తెగిపోయిన ముస్టాంగ్​లోని లేటే ప్రాంతంలో గాలిస్తున్నట్లు తెలిపారు.

Last Updated :May 29, 2022, 12:15 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.