వరుణుడి బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 17 మంది దుర్మరణం

వరుణుడి బీభత్సం.. కొండచరియలు విరిగిపడి 17 మంది దుర్మరణం
పొరుగు దేశం నేపాల్ను భారీ వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. కుండపోతగా కురుస్తున్న వర్షాలు బీభత్సం సృష్టిస్తున్నాయి. సుదర్పశ్చిమ్ , అచ్ఛం జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో కొండచరియలు విరిగిపడి 17 మంది దుర్మరణం చెందారు.
Nepal LandSlides : నేపాల్లోని అచ్చాం, సుదూర్పశ్చిమ్ జిల్లాల్లో కుండపోత వర్షాలకు కొండచరియలు విరిగిపడి 17 మంది దుర్మరణం పాలయ్యారు. ప్రకృతి భీభత్సానికి అక్కడి రహదార్లు పూర్తిగా ధ్వంసమవ్వడంతో గాయపడ్డ మరో 11మందిని వాయుమార్గంలో ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
ఈ దుర్ఘటనలో మరణాల సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. శిథిలాల కింద మరింత మంది చిక్కుకొని ఉండవచ్చని అధికారులు వెల్లడించారు. ప్రతి ఏటా అక్కడ కొండచరియలు విరిగిపడి ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులు వెల్లడించారు.
ఇవీ చదవండి:
లష్కరే తోయిబా ఉగ్రవాదికి అండగా చైనా.. భారత్, అమెరికా ప్రయత్నాలకు అడ్డుపుల్ల
బ్రిటన్ రాణి అంత్యక్రియలకు రిహార్సల్స్.. లండన్కు బయల్దేరిన రాష్ట్రపతి ముర్ము
