అదుపు తప్పి రెండు బస్సులు బోల్తా.. 12 మంది మృతి.. 31 మందికి గాయాలు

author img

By

Published : Sep 23, 2022, 9:02 AM IST

bus accident in Nepal

Bus Accident In Nepal: నేపాల్​లో ఘోర రోడ్డు ప్రమాదాలు జరిగాయి. బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టిన ఘటనలో ఏడుగురు మరణించారు. మరో 18 మంది గాయపడ్డారు. మరో రోడ్డు ప్రమాదంలో ఐదుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 13 మంది క్షతగాత్రులయ్యారు.

Bus Accident In Nepal: నేపాల్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మినీ బస్సు బోల్తా కొట్టడం వల్ల ఏడుగురు ప్రాణాలు కోల్పోగా.. మరో 18 మంది గాయపడ్డారు. బాగ్మతి ప్రావిన్స్​లోని మకవాన్​పుర్​ వద్ద గురువారం జరిగిందీ ఘటన.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కాఠ్​మాండూ నుంచి బిర్‌గంజ్ వైపు వెళ్తున్న బస్సు మకవాన్‌పుర్ వద్ద అదుపు తప్పి బోల్తాకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ప్రయాణికుల్లో ఆరుగురు అక్కడికక్కడే మరణించగా.. మరొకరు స్థానిక ఆరోగ్య కేంద్రంలో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.

మరో ఐదుగురు.. పశ్చిమ నేపాల్‌లోని క్యాంగసిబగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కాఠ్​మాండూ నుంచి రుకుమ్​కోట్​కు వెళ్తున్న బస్సు అదుపు తప్పి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో ఐదుగురు మరణించారు. మరో 13 మంది గాయపడ్డారు. క్షతగాత్రుల్లో ముగ్గురి పరిస్థతి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. గాయపడిన వారిని రుకుంపుర్ ఆస్పత్రికి తరలించారు పోలీసులు.

ఇవీ చదవండి: వలసదారుల పడవ బోల్తా..15 మంది దుర్మరణం

ఆందోళనకారులపై ఉక్కుపాదం.. 31మంది మృతి!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.