శరణార్థుల వ్యథకు అక్షరరూపం- రజాక్​కు నోబెల్​

author img

By

Published : Oct 7, 2021, 4:37 PM IST

Updated : Oct 7, 2021, 5:45 PM IST

Nobel Prize for Literature 2021 to be announced

ప్రముఖ నవలా రచయిత అబ్దుల్​ రజాక్​ గుర్నాకు (టాంజానియా).. సాహిత్య రంగంలో(Nobel prize 2021 in literature) 2021కి గానూ నోబెల్​ పురస్కారం దక్కింది. వలసవాదంపై రాజీలేని పోరాటంతో పాటు, శరణార్థుల వ్యథను కళ్లకు కట్టినందుకు రజాక్‌కు ఈ అవార్డును అందిస్తున్నట్లు రాయల్‌ స్వీడిష్‌ అకాడమీ వెల్లడించింది.

సాహిత్య రంగంలో ఈ ఏడాది నోబెల్​ పురస్కారం(Nobel prize 2021 in literature) ప్రముఖ నవలా రచయిత అబ్దుల్​ రజాక్ గుర్నాకు(టాంజానియా) దక్కింది. శరణార్థుల వెతలకు అక్షరరూపం ఇచ్చి.. కళ్లకు కట్టినట్లు రచనలు చేసినందున రజాక్​కు నోబెల్​ పురస్కారం అందిస్తున్నట్లు పేర్కొంది రాయల్​ స్వీడిష్​ అకాడమీ. ఆయనకు.. బంగారు పతకం, 11 లక్షల డాలర్ల నగదు బహుమతి అందజేయనుంది.

టాంజానియాలోని జాంజిబర్​లో 1948లో జన్మించిన రజాక్​.. 1960 చివర్లో ఇంగ్లాండ్​కు వలసవెళ్లి అక్కడే స్థిరపడ్డారు. ప్రసిద్ధ కెంట్​ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్​గా పనిచేసి ఇటీవలే పదవీ విరమణ చేశారు. గుర్నా.. ఇప్పటివరకు 10 నవలలు సహా ఎన్నో చిన్న చిన్న కథలు రచించారు. ఆయన రాసిన 'ప్యారడైజ్'​ అనే నవల 1994 మ్యాన్​ బుకర్​ ప్రైజ్​కు షార్ట్​ లిస్ట్​ అయింది.

స్వతహాగా శరణార్థి అయిన రజాక్​.. వలసవాదం వెతలు, శరణార్థుల జీవితాలను ప్రతిబింబించేలానే రచనలు చేశారు.

NobelPrize in Literature,  novelist Abdulrazak Gurnah
అబ్దుల్​ రజాక్​

నోబెల్​ సాహిత్య పురస్కారానికి(Nobel prize 2021 in literature) ఘన చరిత్రే ఉంది. గతేడాది అమెరికాకు చెందిన ప్రముఖ కవయిత్రి లూయిస్​ గ్లక్​కు ఈ రంగంలో నోబెల్​ దక్కింది.

2018లో సాహిత్య నోబెల్​పై(Nobel prize 2021 in literature) ఊహించని రీతిలో మచ్చ పడింది. విజేతను నిర్ణయించే స్వీడిష్​ కమిటీలో లైంగిక వేధింపుల వార్తలు కలకలం రేపాయి. ఈ నేపథ్యంలో ఆ ఏడాది పురస్కారాన్ని వాయిదా వేశారు. 2018తో పాటు 2019ని కలిపి ఒకేసారి ఇచ్చారు.

భారత దేశానికి చెందిన కవి రవీంద్రనాథ్​ ఠాగూర్​కు 1913లో నోబెల్​ బహుమతి దక్కింది. ఆయన రచించిన గీతాంజలి కావ్యానికి.. ఈ పురస్కారం వరించింది. నోబెల్​ సాహిత్య అవార్డు పొందిన తొలి ఆసియా వాసి ఠాగూర్​.

ఈ ఏడాది వీరికే..

సోమవారం(అక్టోబర్​ 4న) వైద్య శాస్త్రంలో (nobel prize medicine 2021) నోబెల్​ బహుమతిని ప్రకటించగా.. అమెరికన్‌ శాస్త్రవేత్తలు డేవిడ్‌ జూలియస్‌, ఆర్డెమ్‌ పటపౌటియన్‌లు ఈ పురస్కారాన్ని దక్కించుకున్నారు.

భౌతిక శాస్త్రంలో(nobel prize 2021 physics) నోబెల్​ను మంగళవారం ప్రకటించగా.. సుకురో మనాబే, క్లాస్ ​హాసిల్​మేన్​, జార్జియో పారిసీ దీనిని దక్కించుకున్నారు.

అసిమెట్రిక్​ ఆర్గానోకెటాలిసిస్​ను అభివృద్ధికి దోహదం చేసినందుకు.. రసాయన శాస్త్రంలో 2021కి గాను నోబెల్ ​బహుమతిని(nobel prize 2021 chemistry) బెంజమిన్​ లిస్ట్​, డేవిడ్​ డబ్ల్యూసీ మెక్​మిలన్​ దక్కించుకున్నారు.

అక్టోబర్​ 8న శాంతి బహుమతి, అక్టోబర్​ 11న చివరగా ఆర్థిక శాస్త్రంలో నోబెల్​ బహుమతులను ప్రకటించనుంది రాయల్​ స్వీడిష్​ అకాడమీ.

ఇవీ చూడండి: భూతాపంపై పరిశోధనలు చేసిన వారికి నోబెల్

బెంజమిన్, డేవిడ్​కు రసాయన శాస్త్రంలో నోబెల్​

డేవిడ్​-ఆర్డెమ్​కు వైద్య శాస్త్రంలో నోబెల్​ బహుమతి

Last Updated :Oct 7, 2021, 5:45 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.