అక్కడ 11% పెరిగిన కరోనా కేసులు: డబ్ల్యూహెచ్​ఓ

author img

By

Published : Nov 24, 2021, 10:53 PM IST

Europe COVID cases

europe coronavirus rise: యూరప్​లో గతవారం 11 శాతం కరోనా కేసులు పెరిగాయని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో ఏడు లక్షల మంది కరోనా బారిన పడి మృతి చెందనున్నట్లు డబ్ల్యూహెచ్​ఓ యూరప్​ డైరెక్టర్ డా. హాన్స్ క్లజ్​ తెలిపారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

యూరప్​లో కరోనా ఉద్ధృతి మళ్లీ (europe coronavirus rise) పెరుగుతోంది. గతవారం 11 శాతం అధికంగా కరోనా కేసులు నమోదయ్యాయని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. ప్రపంచవ్యాప్తంగా 6 శాతం అధికంగా కేసులు పెరిగాయని వెల్లడించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి మరో ఏడు లక్షల మంది కరోనా బారిన పడి మృతి చెందనున్నట్లు డబ్ల్యూహెచ్​ఓ యూరప్​ డైరెక్టర్ డా. హాన్స్ క్లజ్​ తెలిపారు. కరోనా నిబంధనలు తప్పనిసరిగా పాటించాలని సూచించారు.

ఆస్ట్రియా, ఆస్ట్రేలియా, నెదర్లాండ్స్​, బెల్జియంలు తాజాగా లాక్​డౌన్​లను కూడా విధించాయి. జర్మనీలో కరోనా వ్యాప్తి రోజురోజుకు పెరుగుతోంది. లక్ష మరణాల మార్క్​ను ఆ దేశం ఈ వారం దాటనుంది. కరోనా టీకా వేసుకోవాలని అక్కడి రాజకీయ నాయకులు పిలుపునిస్తున్నారు. అటు.. యూరప్​లో ఇప్పటివరకు 100 కోట్ల టీకా డోసులు పంపిణీ అయ్యాయి.

చెక్​ రిపబ్లిక్​లోనూ కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి (europe covid cases news). ప్రతిరోజు 26 వేల కేసులు వెలుగులోకి వస్తున్నాయని ఆ దేశ ఆరోగ్య శాఖ తెలిపింది. వైరస్ వ్యాప్తి పెరగగా.. టీకా తప్పకుండా వేసుకోవాలని పౌరులకు ప్రభుత్వం సూచిస్తోంది. తాజా పరిణామాలతో వైరస్​ను కట్టడి చేసే ప్రణాళికను ప్రభుత్వం త్వరలో విడుదలచేయనుంది.

అయితే.. కరోనా వ్యాప్తి ఆఫ్రికాలో గణనీయమైన స్థాయిలో తగ్గిందని డబ్ల్యూహెచ్​ఓ తెలిపింది. మరణాలు 30 శాతం తగ్గాయని పేర్కొంది. అమెరికాలో కేసులు స్థిరంగా నమోదవుతున్నాయి. కానీ మరణాలు 19 శాతం పెరిగాయని వెల్లడించింది.

ఇదీ చదవండి: 'టీకా వేసుకోండి.. లేకపోతే కొవిడ్​ తెచ్చుకోండి'

మరో 7 లక్షల మరణాలు తప్పవు.. డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.