బస్సులో చెలరేగిన మంటలు- 45 మంది సజీవదహనం!

author img

By

Published : Nov 23, 2021, 10:20 AM IST

Updated : Nov 23, 2021, 11:47 AM IST

Bulgaria accident

10:16 November 23

బస్సులో చెలరేగిన మంటలు- 45 మంది సజీవదహనం!

బల్గేరియాలో (Bulgaria accident news) ఘోర ప్రమాదం జరిగింది. మంగళవారం ఉదయం అకస్మాత్తుగా ఓ బస్సులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో 45 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. పలువురికి గాయాలయ్యాయి. వీరిని ఆస్పత్రులకు తరలించారు. 

మృతుల్లో 12 మంది చిన్నారులు కూడా ఉన్నట్లు తెలుస్తోంది. 

ప్రమాదానికి గురైన బస్సు (Bus crash).. మెసిడోనియాకు చెందినదిగా అధికారులు గుర్తించారు. ఆ దేశ అధికారులు.. ఆస్పత్రులకు వెళ్లి చికిత్స తీసుకుంటున్న బాధితులను పరామర్శించినట్లు వెల్లడించారు.

మంటలకు అసలు కారణం తెలియరాలేదు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ఇదీ చూడండి: 'టీకా వేసుకోండి.. లేకపోతే కొవిడ్​ తెచ్చుకోండి'

Last Updated :Nov 23, 2021, 11:47 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.