పండుగ పూట విషాదం- 32 మంది దుర్మరణం

author img

By

Published : Oct 12, 2021, 4:46 PM IST

Updated : Oct 12, 2021, 8:50 PM IST

Twenty-two people killed in bus accident in Nepal

16:44 October 12

పండుగ పూట విషాదం- 32 మంది దుర్మరణం

నేపాల్​లోని ముగు జిల్లాలో ఘోర బస్సు ప్రమాదం జరిగింది. నేపాల్‌గంజ్​ నుంచి ముగు జిల్లా కేంద్రం గంగఢీ వైపు వెళ్తున్న బస్సు పినా ఝ్యారీ నదిలో పడింది. ఈ ఘటనలో మొత్తం 32 మంది ప్రాణాలు కోల్పోయారు. మరో 15 మందికి గాయాలయ్యాయి. 

విజయదశమి పండుగ కోసం.. ప్రయాణికులంతా వేర్వేరు ప్రాంతాల నుంచి తమ ఇళ్లకు వెళ్తుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఘటనా స్థలం నుంచి మృతదేహాలను వెలికితీసేందుకు సైన్యం రంగంలోకి దిగింది.   

Last Updated :Oct 12, 2021, 8:50 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.