తాలిబన్ల దాడిలో భారతీయ జర్నలిస్టు మృతి

author img

By

Published : Jul 16, 2021, 2:35 PM IST

Danish Siddiqui

అఫ్గానిస్థాన్​లో ఆ దేశ బలగాలకు, తాలిబన్లకు మధ్య జరిగిన భీకర ఘర్షణలో పులిట్జర్ అవార్డు గ్రహీత, భారతీయ జర్నలిస్టు డానిష్ సిద్ధిఖీ ప్రాణాలు కోల్పోయారు. ఈ విషయాన్ని భారత్​కు అఫ్గానిస్థాన్ రాయబారి ఫరీద్​ మముంద్​జాయ్​ వెల్లడించారు.

అఫ్గానిస్థాన్​లో తాలిబన్లకు, అక్కడి భద్రతా దళాలకు మధ్య జరుగుతున్న భీకర పోరును చిత్రీకరించేందుకు వెళ్లిన ప్రముఖ భారతీయ జర్నలిస్టు, పులిట్జర్ అవార్డు గ్రహీత డానిష్ సిద్ధిఖీ మరణించారు. కాందహార్ రాష్ట్రంలో గురువారం రాత్రి ఈ ఘటన జరిగింది. ఈ విషయాన్ని భారత్​కు అఫ్గానిస్థాన్​ రాయబారి ఫరీద్ మముంద్​జాయ్ వెల్లడించారు. ఆయన మృతి పట్ల తీవ్ర విచారం వ్యక్తం చేశారు.

ప్రముఖ రాయిటర్స్ వార్తా సంస్థలో ఫొటో జర్నలిస్టుగా పని చేస్తున్నారు సిద్ధిఖీ. అఫ్గాన్​లో తాలిబన్లు, సైన్యానికి మధ్య జరుగుతున్న ఘర్షణలు, పరిస్థితిని చిత్రికరించేందుకు వారం రోజులుగా ఆయన కాందహార్​లోనే ఉంటున్నారు.

ముంబయికి చెందిన 40 ఏళ్ల సిద్ధిఖీ రాయిటర్స్ వార్తా సంస్థ తరఫున పులిట్జర్ అవార్డు గెలుచుకున్నారు.

ఇదీ చూడండి: మంటల్లో చిన్నారి- ఆ తల్లి ఎలా కాపాడుకుందంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.