కశ్మీర్​ అంశంపై యూఎన్​కు పాక్​ మంత్రి లేఖ

author img

By

Published : Dec 7, 2021, 5:30 AM IST

pak in Kashmir issue

Pak in Kashmir Issue: కశ్మీర్​ అంశంపై పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్​ ఖురేషీ మరోసారి వివాదాస్పదంగా స్పందించారు. ఆర్టికల్ 370తో సహా కశ్మీర్ ఇతర అంశాల్లో భారత్ వెనక్కి తగ్గాలని కోరుతూ ఐక్యరాజ్య సమితి అధికారులకు లేఖ రాశారు.

Pak in Kashmir Issue: కశ్మీర్​ అంశంపై ఐక్యరాజ్య సమితికి మరోసారి లేఖ రాశారు పాకిస్థాన్ విదేశాంగ మంత్రి షా మహమ్మద్​ ఖురేషీ. ఆర్టికల్ 370తో సహా కశ్మీర్ ఇతర అంశాల్లో భారత్​ వెనక్కి తగ్గాలని కోరుతూ యూఎన్ జనరల్ సెక్రటరీ, యూఎన్ సెక్యురిటీ కౌన్సిల్​ అధ్యక్షునికి లేఖ రాశారు.

ఆర్టికల్​ 370 రద్దు అనంతరం ఇండియా, పాకిస్థాన్​ మధ్య విభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. కశ్మీర్ తమ అంతర్గత సమస్య, ​ ఈ అంశంలో పాకిస్థాన్ తలదూర్చవద్దని భారత్​ చెబుతుండగా.. పాక్ మాత్రం కశ్మీర్​ అంశాన్ని అంతర్జాతీయ వేదికలపై తరచూ లేవనెత్తుతోంది.

ఇదీ చదవండి:Etela Jamuna Comments: గతంలో లేనిది ఇప్పుడే ఆక్రమించుకున్నారా?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.