బైడెన్​ను కాపాడిన వ్యక్తిని అఫ్గాన్​లోనే వదిలేసిన అమెరికా!

author img

By

Published : Sep 2, 2021, 3:39 PM IST

biden

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్(biden news)​.. సెనేటర్​గా ఉన్న రోజుల్లో ఓసారి అఫ్గాన్​ పర్యటనకు వెళ్లారు. ప్రతికూల పర్యటనల కారణంగా ఆయన హెలికాప్టర్​ను మారుమూల గ్రామంలో అత్యవసరంగా ల్యాండ్​ చేయాల్సి వచ్చింది. క్లిష్టపరిస్థితుల్లో బైడెన్​ బృందాన్ని అన్వేషించడం భద్రతా దళాలకు కష్టంగా మారింది. ఈ నేపథ్యంలో ఓ దుబాసి భద్రతా దళాలకు సాయం చేశాడు. అలా బైడెన్​ బృందాన్ని రక్షించగలిగారు. కానీ ఇప్పుడు తాలిబన్ల రాజ్యంలో చిక్కుకున్న ఆ దుబాసి... తనను, తన కుటుంబాన్ని రక్షించాలని వేడుకుంటున్నాడు(afghan interpreters left behind).

అది 2008. అఫ్గానిస్థాన్​. నాటి సెనేటర్​ జో బైడెన్(biden news)​, మరో ఇద్దరితో కలిసి అఫ్గాన్​ పర్యటనలో ఉన్న సమయం. రెండు హెలికాప్టర్​లలో బైడెన్​ బృందం ప్రయాణిస్తుండగా ఒక్కసారిగా మంచు తుపాను విరుచుకుపడింది. అత్యవసరంగా హెలికాప్టర్ల​ను ఓ లోయలో ల్యాండ్​ చేయాల్సి వచ్చింది. బయట తుపాను, లోపల ఆందోళన. ఎక్కడ ఉన్నారన్న విషయం కూడా తెలియదు.

ఈ సమయంలో హెలికాప్టర్​ నుంచి అమెరికా భద్రతా దళానికి సమాచారం అందింది. భద్రతాధికారులు వెంటనే రంగంలోకి దిగారు. హెలికాప్టర్​ ఉన్న ప్రాంతానికి వెళ్లడం, ఆ పరిస్థితుల్లో కాస్త ప్రమాదకరం. కొండలు ఎక్కి, దిగి ప్రయాణించాల్సి ఉంటుంది. ఆ సమయంలో మహమ్మద్​ అనే అనువాదకుడు అగ్రరాజ్య భద్రతా దళానికి సహాయం చేశాడు. బైడెన్​ విమానం కోసం చేపట్టిన గాలింపు చర్యల్లో పాల్గొన్నాడు. భద్రతా దళాలకు మార్గనిర్దేశం చేస్తూ బైడెన్​(biden afghanistan news) వద్దకు తీసుకెళ్లాడు.

మహమ్మద్​ శ్రమకు గతంలో గుర్తింపు లభించింది. ఎందరో అధికారులు ఆయన్ని ప్రశంసించారు.

కానీ ఇప్పుడు పరిస్థితులు మారిపోయాయి. కాబుల్​ను తాలిబన్లు ఆక్రమించుకున్న అనంతరం మహమ్మద్​ కుటుంబం బిక్కుబిక్కుమంటూ జీవిస్తోంది. గతంలో అమెరికాకు తాను సాయం చేయడం వల్ల ఇప్పుడు తాలిబన్లు తనను చంపేస్తారని మహమ్మద్​ భయపడుతున్నాడు. భార్య, నలుగురు పిల్లలతో తాను తాలిబన్ల నుంచి తప్పించుకుని జీవిస్తున్నట్టు పేర్కొన్నాడు(afghan interpreters left behind).

"హలో ప్రెసిండెంట్​. నన్ను, నా కుటుంబాన్ని రక్షించండి," అని మహమ్మద్​ వేడుకుంటున్నాడు. కాగా.. అమెరికా తరలింపు ప్రక్రియ ఆగస్టు 31తో ముగియడం వల్ల మహమ్మద్​ ఆశలు సన్నగిల్లాయి.

అయితే ఈ వ్యవహారంపై శ్వేతసౌధం మంగళవారం స్పందించింది. ఎలాగైనా మహమ్మద్​ను రక్షిస్తామని హామీనిచ్చింది.

"20ఏళ్ల పాటు అమెరికా తరఫున పోరాడినందుకు ధన్యవాదాలు. ఆ రోజు మంచు తుపాను నుంచి బైడెన్​ను రక్షించినందుకు ధన్యవాదాలు. మిమ్మల్ని మేము బయటకు తీసుకొస్తాము. మీ సేవకు గౌరవం దక్కుతుంది. ఎలాగైనా మిమ్మల్ని బయటకు తీసుకొస్తాము," అని ప్రెస్​ కార్యదర్శి జెన్​ సాకి వెల్లడించారు.

ఆగస్టు 15న కాబుల్​ను ఆక్రమించుకున్నారు తాలిబన్లు(taliban latest news). అప్పటి నుంచి ఆగస్టు 31 వరకు పౌరులు, భద్రతాధికారులు, సైనికులు తరలింపు ప్రక్రియ ముమ్మరంగా సాగింది. అప్గాన్​ పౌరులు కూడా దేశాన్ని వీడేందుకు కాబుల్​ విమానాశ్రయానికి ఎగబడ్డారు. ఈ క్రమంలో అనేకమార్లు తొక్కిసలాటలు జరిగాయి. రద్దీ ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకుని ఐసిస్​ కే ఉగ్రసంస్థ పేలుళ్లకు పాల్పడింది. ఈ ఘటనలో 180కిపైగా మంది ప్రాణాలు కోల్పోయారు. వీరిలో పలువురు అమెరికా సైనికులున్నారు. ఇందుకు ప్రతీకారంగా ఐసిస్​ కే స్థావరాలపై మెరుపుదాడులు చేసింది అగ్రరాజ్యం. ఇంతటి ఉద్రిక్త వాతావరణం మధ్య ఆగస్టు 31తో తరలింపు ప్రక్రియ ముగిసినట్టు అధ్యక్షుడు జో బైడెన్​ ప్రకటించారు. అగ్రరాజ్య చరిత్రలో ఇదే అత్యంత క్లిష్టమైన మిషన్​గా అభివర్ణించారు.

ఇదీ చూడండి:- తాలిబన్ల మెరుపు వేగానికి బైడెన్ షాక్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.