'ఉక్రెయిన్​కు ఆయుధాలు ఇస్తాం.. వారిని ఆదుకుంటాం'

author img

By

Published : Mar 15, 2022, 8:36 AM IST

biden

Ukraine crisis: ఉక్రెయిన్​కు అన్ని విధాలా అండగా ఉంటామన్నారు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​. ఆయుధ పరికరాలతో పాటు.. ఆర్థిక, ఆహార, మానవతా సాయం చేస్తామని ట్విట్టర్​ వేదికగా వెల్లడించారు. ఉక్రెయిన్​ శరణార్థులను అమెరికాలోకి అనుమతిస్తామని తెలిపారు.

Ukraine crisis: ఉక్రెయిన్​పై రష్యా సేనలు నిప్పుల వర్షం కురిపిస్తున్న వేళ.. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉక్రెయిన్​కు తాము అండగా నిలుస్తామన్న బైడెన్​.. ఆయుధాలు సరఫరా చేస్తామన్నారు. అలాగే శరణార్థులను తమ దేశంలోకి అనుమతించనున్నట్లు తెలిపారు. కీవ్​కు ఆర్థిక, ఆహారంతో పాటు ఇతర మానవతా సాయం చేస్తామని ట్విట్టర్​ వేదికగా తెలిపారు.

"దండయాత్ర చేస్తున్న రష్యా బలగాలను నిలువరించేందుకు ఉక్రెయిన్ వద్ద ఆయుధాలు ఉన్నాయని నిర్ధరించుకుంటాం. ఉక్రెయిన్​ ప్రజల ప్రాణాలను కాపాడేందుకు డబ్బు, ఆహారం, మానవతా సహాయాన్ని పంపుతాం. ఉక్రెయిన్​ శరణార్థులను స్వాగతిస్తాం" అని బైడెన్​ చెప్పారు.

అధ్యక్షుడు బైడెన్​.. ఉక్రెయిన్‌కు అదనపు ఆయుధాలు, పరికరాల కోసం 200 మిలియన్ల డాలర్లు సాయం అందించినట్లు శ్వేతసౌధం శనివారం (స్థానిక కాలమానం) తెలిపింది. "ఈ రోజు అధ్యక్షుడు బైడెన్ ఉక్రెయిన్‌కు అదనపు ఆయుధాలు, పరికరాల కోసం 200 మిలియన్​ డాలర్లు సాయం అందించారు. 2021 జనవరి నుంచి ఇప్పటివరకు 1.2 బిలియన్​ డాలర్ల రక్షణ సాయాన్ని ఉక్రెయిన్​కు అమెరికా అందించింది." అని శ్వేతసౌధం ట్వీట్ చేసింది.

మరోవైపు మానవతా కారిడార్లు లక్ష్యంగా రష్యా దాడులు చేస్తున్నట్లు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్​స్కీ ఆరోపించారు.

ఉక్రెయిన్‌ను ఆక్రమించుకునే క్రమంలో ఆ దేశంలోని ప్రధాన నగరాలపై రష్యా సేనలు విచక్షణారహితంగా దాడులకు పాల్పడుతున్నాయి. బాంబులు, క్షిపణులతో నివాస భవనాలపై దాడులకు తెగబడుతూ మారణకాండ సృష్టిస్తున్నాయి.

ఇదీ చూడండి: రష్యా క్షిపణుల వర్షం.. పదుల సంఖ్యలో మరణాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.