లాటరీ టికెట్ కొని మర్చిపోయిన మెకానిక్.. కొద్దిరోజులకు కోటీశ్వరుడై...

author img

By

Published : Oct 10, 2021, 2:56 PM IST

lottery winner

అతడో మెకానిక్​.. ఓ రోజు పనిచేయడానికి వెళ్లిన దగ్గర లాటరీ టికెట్​ విక్రయ కేంద్రం కనిపించింది. చాలా మందితోపాటు తానూ ఓ టికెట్​ కొనుగోలు చేశాడు. తర్వాత ఆ విషయమే మర్చిపోయాడు. అనూహ్యంగా.. ఆ టికెట్టే అతడ్ని కోటీశ్వరుడిగా మార్చింది.

అమెరికా నార్త్​ కరోలినాలోని ఓ మెకానిక్​ను అదృష్టం వరించింది. లాటరీలో దాదాపు 2 లక్షల డాలర్లను(దాదాపు రూ.1.5 కోట్లు) అతడు గెలుచుకున్నాడు. ఇప్పుడు ఆ డబ్బులతో తన కుటుంబ కలలను తీర్చాలని అతడు ఆశపడుతున్నాడు.

ఆ విషయమే మరిచిపోయినా...

ఫ్రాంక్​విల్లే ప్రాంతానికి చెందిన గ్రెగరీ వారెన్​.. సెప్టెంబరు 29న ఓ చోట గ్యాస్ ఫిల్లింగ్ చేయడానికి వెళ్లి, అక్కడ 'క్యాష్​ 5 లాటరీ' టికెట్టును కొనుగోలు చేశాడు. కానీ, అక్టోబరు 4వరకు అతడు ఆ టికెట్​ సంగతే పట్టించుకోనే లేదు. కానీ, అనూహ్యంగా అతడు కొనుగోలు చేసిన టికెట్టే లాటరీలో జాక్​పాట్​ గెలుచుకుంది. 391,870 డాలర్ల ఈ మొత్తం లాటరీ బహుమతిలో అతడు సగం డబ్బులను(195,935 డాలర్లు) గెలుచుకున్నాడు.

"నేను తరుచూ లాటరీ టికెట్లను కొనగోలు చేయను. అనుకోకుండా ఆ రోజు దాన్ని కొనుగోలు చేశాను. కానీ, నేను దాని గురించే మరిచిపోయాను. చివరకు నేనే ఆ లాటరీలో గెలిచానన్న విషయం తెలిశాక ఎంతో ఆశ్చర్యపోయాను. ఈ విషయం విని, రాత్రంతా అస్సలు నిద్ర పట్టలేదు"

-గ్రెగరీ వారెన్​, లాటరీ విజేత

పన్నుల తర్వాత.. 138,624 డాలర్ల చెక్​ను లాటరీ నిర్వాహకుల నుంచి మంగళవారం అందుకున్నాడు వారెన్​. తనకు వచ్చిన ఈ డబ్బులను తన కుటుంబ కోసం, వ్యాపారం కోసం వినియోగిస్తానని చెప్పాడు అతడు. "నాకు 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. ఇప్పుడు నేను ఏదైనా వ్యాపారం చేయాలనుకుంటున్నాను. నా కుమారుడు హైస్కూల్ చదువు పూర్తి చేసి, గ్రాడ్యుయేషన్​కు చేరుకునే సరికి ఆ డబ్బులు ఉపయోగపడతాయి" అని వారెన్ తెలిపాడు.

ఈ లాటరీ డ్రాలో మరో సగం జాక్​పాట్​ను​ ఓ మహిళ దక్కించుకుంది.

ఇవీ చూడండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.