ఆంక్షలు ఎత్తివేత.. ఇక ఆ దేశానికి విమానాలు షురూ..

author img

By

Published : Sep 26, 2021, 12:00 PM IST

canada

భారత్​లో కరోనా తగ్గుముఖం పడుతున్న క్రమంలో.. విమానాల ప్రయాణాలపై విధించిన ఆంక్షలను ఒక్కో దేశం ఎత్తివేస్తోంది. నవంబర్​ నుంచి ప్రయాణ ఆంక్షలను ఎత్తివేస్తున్నట్టు అమెరికా ఇప్పటికే ప్రకటించింది. తాజాగా కెనడా(Canada India flight) కూడా ప్రయాణాలకు అనుమతి ఇచ్చింది. భారత్​పై ఉన్న ఆంక్షలను ఎత్తివేసింది. దీంతో ఇరు దేశాల మధ్య విమాన సేవలు సోమవారం ప్రారంభం కానున్నాయి.

కరోనా నిబంధనల్లో భాగంగా భారత విమానాలపై (Canada flights from india) విధించిన ఆంక్షలను కెనడా ఎత్తివేసింది. ఫలితంగా సోమవారం భారత్​-కెనడా మధ్య ప్రత్యక్ష విమాన సేవలు ప్రారంభం కానున్నాయి(Canada flights update india). ఈ విషయాన్ని జస్టిన్​ ట్రుడో ప్రభుత్వం ఓ ప్రకటన ద్వారా తెలియజేసింది.

"సెప్టెంబర్​ 27 నుంచి కెనడా-భారత్​ మధ్య ప్రత్యక్ష విమానాలు పునఃప్రారంభమవుతాయి."

-- కెనడా ప్రభుత్వం.

ప్రభుత్వ గుర్తింపు ఉన్న ల్యాబొరేటరీ నుంచి కొవిడ్​ నెగిటివ్​ సర్టిఫికేట్​ ఉంటేనే విమానంలోకి అనుమతిస్తారు(Canada flights from India news).

"దిల్లీ విమానాశ్రయంలో.. కొవిడ్​ నెగిటివ్​ రిపోర్టు చూపించాలి. అప్పుడే వారికి అనుమతి ఉంటుంది. రిపోర్టు కూడా ప్రయాణానికి 18 గంటలలోపు ఉండాలి."

-- కెనడా ప్రభుత్వం.

ఎయిర్​ కెనడా.. సోమవారం నుంచి ప్రారంభమయ్యే అవకాశముంది. ఎయిర్​ ఇండియా.. ఈ నెల 30న మొదలవుతుందని సంబంధిత వర్గాలు తెలిపాయి.

దేశంలో పరిస్థితులు మెరుగుపడిన నేపథ్యంలో కెనడా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది.

అంతర్జాతీయ విమానాలపై దేశంలో నిషేధం

అంతర్జాతీయ వాణిజ్య విమానాల రాకపోకలపై ఉన్న నిషేధాన్ని(Flight Ban India) ఈ నెల 30 వరకు పొడగిస్తూ గత నెలలో నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం. కమర్షియల్ ప్యాసెంజర్ విమానాలపై ఆంక్షలు అమల్లో ఉంటాయని ఓ ప్రకటనలో తెలిపింది. అయితే డీజీసీఏ (DGCA) అనుమతిచ్చిన కార్గో విమాన సర్వీసులు మాత్రం యథావిధిగా కొనసాగుతాయని స్పష్టం చేసింది. ఈమేరకు అధికారిక ప్రకటన విడుదల చేసింది.

కొన్ని ఎంపిక చేసిన మార్గాల్లో అధికారుల అనుమతి ఉన్న అంతర్జాతీయ విమానాలకు ఈ ఆంక్షల నుంచి మినహాయింపు ఇచ్చింది కేంద్రం.

అమెరికాలో..

అమెరికా వివిధ దేశాలపై ప్రయాణ ఆంక్షలను (US travel restrictions) ఎత్తివేయనుంది. నవంబర్ నెల ప్రారంభం నుంచి భారత్​తో పాటు, ఐరోపా సమాఖ్య దేశాలు, బ్రిటన్‌, చైనా, ఐర్లాండ్, దక్షిణాఫ్రికా, ఇరాన్, బ్రెజిల్ తదితర దేశాల ప్రయాణికుల రాకపోకలకు అనుమతి ఇవ్వనుంది. ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు శ్వేతసౌధం అధికార వర్గాలు వెల్లడించాయి.

కరోనా మహమ్మారి కారణంగా గతేడాది నుంచి ప్రయాణాలపై ఆంక్షలు (US travel restrictions) విధించింది అమెరికా. అప్పటి ట్రంప్ సర్కారు.. వైరస్ కట్టడికి తొలిసారి అంతర్జాతీయ ప్రయాణికులపై ఆంక్షలు అమలు చేసింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన ప్రస్తుత అధ్యక్షుడు జో బైడెన్.. ఈ ఆంక్షలను కొనసాగించారు. అంతేగాక ఈ ఏడాది ఏప్రిల్‌లో భారత్‌ సహా అనేక దేశాలపై కొత్త ఆంక్షలు విధించారు.

ప్రస్తుతం కరోనా పరిస్థితులు మెరుగుపడినందున కొవిడ్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఇతర దేశాల పౌరులను దేశంలోకి అనుమతి ఇచ్చేందుకు అమెరికా నిర్ణయించింది.

ఇదీ చూడండి:- కొవిషీల్డ్​ను యూకే ఆమోదించినా.. క్వారంటైన్​లోనే భారత ప్రయాణికులు!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.