పట్టాలు తప్పిన రైలు- ముగ్గురు ప్రయాణికులు మృతి

author img

By

Published : Sep 26, 2021, 8:37 AM IST

Updated : Sep 26, 2021, 11:36 AM IST

train accident

అమెరికాలో ఘోర రైలు ప్రమాదం (Amtrak train derailment today) జరిగింది. మోంటానా ప్రాంతంలో రైలు పట్టాలు తప్పి.. ముగ్గురు చనిపోయారు. పలువురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు.

పట్టాలు తప్పిన రైలు

అమెరికాలో మోంటానాలో ఓ రైలు పట్టాలు(Amtrak train derailment today) తప్పింది. ఈ ఘటనలో ముగ్గురు చనిపోయారు. పలువురు ప్రయాణికులకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించారు.

train derails in Montana
పట్టాలు తప్పిన రైలు

సియాటెల్‌ నుంచి షికాగో మధ్య నడిచే అమ్‌ట్రాక్(అమెరికా జాతీయ రైల్వే)సంస్థకు చెందిన ఎంపైర్‌ బిల్డర్‌ ట్రైన్‌ 7/27 మోంటానలోని జోప్లిన్‌ వద్ద ప్రమాదానికి(Amtrak train derailed Chicago) గురైనట్లు అధికారులు తెలిపారు. షికాగో నుంచి సెయింట్‌ పౌల్‌కు వెళ్తుండగా.. స్థానిక కాలమానం ప్రకారం శనివారం సాయంత్రం 4 గంటలకు ఈ ఘటన జరిగింది. ఈ రైలుకు రెండు లోకోమోటీవ్‌లు, 10 బోగీలు ఉన్నాయి. ప్రమాద(Amtrak train derailed video) సమయంలో 147 మంది ప్రయాణికులు, 13 మంది సిబ్బంది అందులో ప్రయాణిస్తున్నారు.

ఆమ్‌ట్రాక్‌ అధికారులు, స్థానిక సిబ్బందితో కలిసి సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై నేషనల్‌ ట్రాన్స్‌పోర్ట్‌ సేఫ్టీ బోర్డు వెంటనే దర్యాప్తు చేపట్టింది.

ఇదీ చూడండి: Afghan Taliban: తాలిబన్ల పాలనలో మీడియాపై ఉక్కుపాదం..

Last Updated :Sep 26, 2021, 11:36 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.