పుష్పలో శ్రీవల్లీ పాత్ర.. రష్మిక కన్నా నేనే బాగా చేస్తా!: ఐశ్వర్య
Updated: May 17, 2023, 7:32 PM |
Published: May 17, 2023, 7:32 PM
Published: May 17, 2023, 7:32 PM
Follow Us 

పుష్ప చిత్రంలో శ్రీవల్లీగా నటించి మంచి మార్కులు కొట్టేసిన హీరోయిన్ రష్మికపై కోలీవుడ్ నటి ఐశ్వర్య రాజేశ్ షాకింగ్ కామెంట్స్ చేసింది. ఆ సినిమాలో రష్మిక కంటే తానే బాగా చేసేదాన్ని అని చెప్పింది. ఇంకా ఏమందంటే?

1/ 22
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్లో వచ్చిన పుష్ప చిత్రం ఎంత పెద్ద హిట్టయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. టైటిల్ రోల్లో బన్నీ నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. భాషతో సంబంధం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా ఈ సినిమాను ఆదరించారు. పాన్ ఇండియా రేంజ్లో భారీ విజయాన్ని అందుకున్న ఈ సినిమా రూ.350 కోట్లకుపైగా వసూళ్లను సాధించింది. అంతేకాకుండా ఈ సినిమాలో శ్రీవల్లీ పాత్రలో నటించిన రష్మిక మందన్నాకు కూడా మంచి మార్కులు పడ్డాయి. తాజాగా రష్మికపై సంచలన వ్యాఖ్యలు చేసింది కోలీవుడ్ బ్యూటీ ఐశ్వర్య రాజేశ్. శ్రీవల్లీ పాత్ర తను ఇంకా బాగా చేసేదాన్నని స్పష్టం చేసింది. ఫర్హానా మూవీ ప్రమోషన్లలో పాల్గొంటున్న ఐశ్వర్య రాజేశ్.. పుష్పలో రష్మిక పాత్ర గురించి షాకింగ్ కామెంట్స్ చేసింది. "పుష్ప చిత్రంలో రష్మిక.. శ్రీవల్లీగా బాగానే చేసింది. కానీ ఆ పాత్రకు నేను బాగా సూటవుతానని అనుకుంటున్నాను. నాకు కానీ ఆ అవకాశం వచ్చినట్లయితే ఆమె కంటే మెరుగ్గా పర్ఫార్మ్ చేసేదాన్ని" అని ఐశ్వర్య తెలిపింది. ప్రస్తుతం ఆమె వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అంతేకాకుండా నెటిజన్లు కూడా విశేషంగా స్పందిస్తున్నారు.
Loading...
Loading...
Loading...