ఎన్టీఆర్​తో అదుర్స్​ సీక్వెల్​.. పూరితో అనుబంధం.. వి.వి.వినాయక్​ ఏమన్నారంటే?

author img

By

Published : Sep 24, 2022, 9:37 PM IST

ntr vv vinayak

ఎన్టీఆర్​తో అదుర్స్​ సీక్వెల్​ చేయడం సహా భవిష్యత్​లో ఇంకేమైనా సినిమాలు చేసే అవకాశం ఉందా లేదా అనే విషయంపై మాట్లాడారు దర్శకుడు వివి వినాయక్​. ఏం చెప్పారంటే..

టాలీవుడ్‌ క్రేజీ కాంబినేషన్లలో దర్శకుడు వి.వి. వినాయక్‌ - హీరో ఎన్టీఆర్‌ కాంబో ఒకటి. తొలి ప్రయత్నం 'ఆది'తోనే ఈ ఇద్దరు కలిసి సరికొత్త రికార్డు సృష్టించారు. ఆ తర్వాత అదుర్స్ వంటి సూపర్​హిట్​ సినిమా కూడా చేశారు. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద అద్భుతమైన విజయాన్ని సొంతం చేసుకుంది. అప్పుడే ఈ చిత్రానికి సీక్వెల్​ కూడా ఉంటుందని తెలిపారు. అయితే అప్పటి నుంచి పట్టాలెక్కలేదు. అసలు దాని గురించి ఎక్కడ ఎటువంటి ప్రస్తావన రాలేదు. అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వివి వినాయక్​.. పలు ఆసక్తికర విషయాలను చెప్పారు. ఇందులో భాగంగానే అదుర్స్ సినిమా సీక్వెల్​ గురించి మాట్లాడారు.

"అదుర్స్ 2పై ఇక తెరకెక్కించేది ఉండడు. ఒకటి రెండు ఐడియాలు వచ్చాయి. కానీ అవి ముందుకు కదలలేదు. నాకే నచ్చలేదు. మా ఇద్దరి కెరీర్​లో అది మంచి సినిమా. దాన్ని అలానే పాడుచేసుకోకుండా ఉంచితే మంచిది" అని అన్నారు. భవిష్యత్​లో మంచి కథ దొరికితే ఎన్టీఆర్​తో సినిమా చేస్తానని చెప్పారు. ఇక 'ఆది' సినిమా గురించి మాట్లాడుతూ.. ఆది కథ రెండు రోజుల్లో రాసినట్లు గుర్తు చేసుకున్నారు. అది అలా జరిగిపోయిందని చెప్పారు. చిరంజీవి గురించి చెబుతూ.. ఆయనతో చేయడం ఎక్సైట్​మెంట్​గా ఉంటుందని చెప్పారు. తనకంతో సపోర్ట్​గా నిలిచినట్లు పేర్కొన్నారు. తన కెరీర్​లో ఆది, చెన్నకేశవరెడ్డి, ఠాగూర్​, ఖైదీ నెంబరు 150 అని చెప్పారు. ఖైదీ నెంబరు 150 చిత్రీకరణను ఎంతో ఆస్వాదిస్తూ పనిచేసినట్లు చెప్పారు.

లైగర్​ సినిమా ఆడకపోవడంపై పూరి గురించి మాట్లాడారు వినాయక్​. "కొంతమంది ఎంటర్‌టైన్‌మెంట్‌ కోసం ఇలాంటి వార్తలు సృష్టిస్తున్నారు. కానీ, పూరీకి సామర్థ్యం ఉంది. 'లైగర్‌' వల్ల తన జీవితం ఏమీ మారదు. ఆయన గతంలోనే ఎన్నో ఫ్లాప్స్‌, హిట్స్‌, సూపర్‌హిట్స్‌ చూశాడు. ఫ్లాప్స్‌ వచ్చినప్పుడు అతడి పని అయిపోయింది అని అనుకున్నారు.. కట్‌ చేస్తే 'పోకిరి'తో బ్లాక్‌బస్టర్‌ ఇచ్చాడు. సినిమా అన్నాక ఆర్థికపరమైన ఇబ్బందులు సహజం. దానికి అతడు ముందే సిద్ధంగా ఉంటాడు. 'లైగర్‌' వల్ల ఎంత పోయింది? ఎంత వచ్చింది?అనేది అతడికే తెలుసు. పోయినదాన్ని తిరిగి పొందలేనంత అసమర్థుడేమి కాదు. మళ్లీ హిట్‌ కొడితే పూరీ పూరీనే అవుతాడు. ఆయన తెరకెక్కించిన సినిమా ఏదైనా ఫ్లాప్‌ అయితే బయటవాళ్లందరూ ఏవేవో అనేసుకుంటారు. కానీ అతడు అలా కాదు. ఫ్లాప్‌ వస్తే దాని గురించి ఎక్కువగా ఆలోచించడు. అతడు ఒక యోగి. ధైర్యవంతుడు. ఇక సినిమా ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు చూసినన్ని కష్టాలు ఎవరు చూసి ఉండరు. ఎన్నో విజయాలు అందుకున్న ఆయన గతంలో ఒక్కసారిగా కిందకి వచ్చేశారు. మళ్లీ బౌన్స్‌బ్యాక్‌ అయ్యారు. సినిమాల్లో ఎత్తుపల్లాలు సర్వసాధారణం" అని వినాయక్ వివరించారు.

ఇదీ చూడండి: వామ్మో.. జక్కన్న-మహేశ్ సినిమాలో థోర్​ కూడానా!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.