ఓటీటీ రిలీజ్​పై నిర్మాతల కీలక నిర్ణయం.. ఇకపై 50రోజుల తర్వాతే

author img

By

Published : Jun 29, 2022, 7:14 PM IST

OTT Release Producers key decision

ఓటీటీలో కొత్త సినిమాల విడుదలపై టాలీవుడ్​ నిర్మాతలు కీలక నిర్ణయాన్ని ప్రకటించారు. థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే సినిమాలు ఓటీటీ స్ట్రీమింగ్​ అవుతాయని చెప్పారు.

ఓటీటీలో కొత్త సినిమాల విడుదలపై టాలీవుడ్​ నిర్మాతలు కీలక నిర్ణయం తీసుకున్నారు. థియేటర్లలో విడుదలైన 50 రోజుల తర్వాతే సినిమాలను ఓటీటీకి ఇచ్చేలా నిర్ణయానికి వచ్చారు. జులై 1 నుంచి ఒప్పందాలు చేసుకునే సినిమాలకు ఈ నిబంధన వర్తించనుందని వారు తెలిపారు.

భారీ బడ్జెట్‌ చిత్రాల నుంచి చిన్న సినిమాల వరకు అన్నీ విడుదలైన కొన్ని రోజులకే ఓటీటీలోకి వస్తుండటం థియేటర్ల వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపుతుందని పలువురు నిర్మాతలు వాపోయారు. అలాగే హీరోల క్రేజ్‌ తగ్గుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయమై చర్చలు జరిపిన నిర్మాతలు బుధవారం సమావేశమయ్యారు. ఈ భేటీలోనే ఓటీటీ రిలీజ్​పై నిర్ణయం తీసుకున్నారు. దీంతో తెలుగు సినిమాలు ఇకపై థియేటర్‌లోకి వచ్చిన 50 రోజుల తర్వాతే ఓటీటీల్లోకి రానున్నాయి.

ఇదీ చూడండి: లావణ్య 'హ్యాపీ బర్త్​డే' ట్రైలర్.. గన్​లతో ఫన్​.. కితకితలే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.