'గాడ్​ఫాదర్'​ రిలీజ్ డేట్​.. ఫస్ట్​లుక్​తో అల్లరి నరేశ్​​.. 'ది ఘోస్ట్'​ కొత్త షెడ్యూల్

author img

By

Published : May 10, 2022, 11:53 AM IST

Chiranjeevi Godfather release date

కొత్త సినిమాలకు సంబంధించిన కొన్ని అప్డేట్స్​ సోషల్​మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. వీటిలో చిరంజీవి 'గాడ్​ఫాదర్'​ రిలీజ్ డేట్​, నాగార్జున 'ది ఘోస్ట్'​ కొత్త షెడ్యూల్​, అల్లరినరేశ్​ 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' ఫస్ట్​లుక్​ పోస్టర్​ వివరాలు ఉన్నాయి.

Chirajeevi Godfather release date: మెగాస్టార్​ చిరంజీవి కథానాయకుడిగా మోహన్‌ రాజా దర్శకత్వంలో తెరకెక్కుతున్న పొలిటికల్‌ యాక్షన్‌ డ్రామా 'గాడ్‌ ఫాదర్'. మలయాళంలో ఘన విజయం సాధించిన 'లూసిఫర్‌'రీమేక్‌గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇందులో బాలీవుడ్‌ స్టార్‌ హీరో సల్మాన్‌ఖాన్‌ కీలక పాత్ర పోషిస్తున్నారు. శరవేగంగా షూటింగ్​ జరుపుకుంటున్న ఈ చిత్ర రిలీజ్​ డేట్​కు సంబంధించి ఓ వార్త నెట్టంట్లో చక్కర్లు కొడుతోంది. ఆగస్టు 12న విడుదల చేయబోతున్నట్లు తెలిసింది. త్వరలోనే దీనిపై స్పష్టత రానుంది. కాగా, ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్‌, గంగవ్వ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. తమన్‌ సంగీతం అందిస్తున్నారు.

Allarinaresh new movie poster: అల్లరి నరేష్‌ అనగానే హాస్య ప్రధానమైన కథలే గుర్తుకొస్తాయి. ఆయన అప్పుడప్పుడూ గాఢమైన భావోద్వేగాలు నిండిన కథల్లోనూ నటించి మెప్పించారు. 'విశాఖ ఎక్స్‌ప్రెస్‌', 'గమ్యం', 'నాంది' తదితర చిత్రాలు ఆయన ఎంపిక చేసుకున్న కథల్లోని వైవిధ్యతని చాటి చెబుతాయి. మరోసారి అలాంటి ఓ విభిన్నమైన కథతో ఆయన 'ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం' చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి ఓ అప్డేట్​ వచ్చింది. ఈ చిత్ర ఫస్ట్​లుక్​ను​ విడుదల చేశారు మేకర్స్​. ఇందులో అల్లరి నేరశ్​ ముఖంపై గాయాలతో ఓ మంచాన్ని భుజంపై మోస్తూ కనిపించారు. ఇది చూస్తుంటే ఓ భావోద్వేగపు సన్నివేశానికి సంబంధించిన పోస్టర్​లా ఉంది. కాగా, ఈ చిత్రంలో ఆనంది కథానాయిక. జీ స్టూడియోస్‌ సమర్పణలో, హాస్య మూవీస్‌ సంస్థ నిర్మిస్తోంది. ఎ.ఆర్‌.మోహన్‌ దర్శకత్వం వహిస్తున్నారు. రాజేష్‌ దండు నిర్మాత. వెన్నెల కిషోర్‌, ప్రవీణ్‌ ఇతర పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి అబ్బూరి రవి మాటలు, శ్రీచరణ్‌ పాకాల సంగీతం, రామ్‌రెడ్డి ఛాయాగ్రహణం అందించారు.

Nagarjuna The Ghost new schedule: నాగార్జున కథానాయకుడిగా ప్రవీణ్‌ సత్తారు తెరకెక్కిస్తున్న యాక్షన్‌ థ్రిల్లర్‌ 'ది ఘోస్ట్‌'. నారాయణ్‌ దాస్‌ నారంగ్‌, పుస్కూర్‌ రామ్‌ మోహన్‌రావు, శరత్‌ మరార్‌ సంయుక్తంగా నిర్మిస్తున్నారు. సోనాల్‌ చౌహాన్‌ కథానాయిక. శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటున్న ఈ చిత్రం కొత్త షెడ్యూల్​ను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇది మే 12 నుంచి హైదరాబాద్​లో ప్రారంభంకానుంది. ఇప్పటికే 60 రోజులకు పైగా గోవా, దుబాయ్, ఊటీలో యాక్షన్​ సహా పాటలను చిత్రీకరించారు. నాగార్జున్, సోనాలి ఇంటర్​పోల్​ ఆఫీసర్లుగా నటిస్తుండగా.. బాలీవుడ్​ నటుడు మనీష్ చౌదరీ ప్రతినాయకుడిగా కనిపించనున్నారు. గల్​ పనాగ్, అనిఖా సురేంద్రన్​, శ్రీకాంత్ అయ్యంగర్​, రవివర్మ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ​రాబిన్‌ సుబ్బు యాక్షన్‌ కొరియోగ్రఫీ చేయగా ముఖేష్‌ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

ఇదీ చూడండి: బాలయ్య 'అన్​స్టాపబుల్'​ క్రేజ్​.. రెండు ప్రతిష్టాత్మక అవార్డులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.