వికారాబాద్​ జిల్లాలో బస్సు బోల్తాపడి మహిళ మృతి..

author img

By

Published : Nov 20, 2022, 4:46 PM IST

వికారాబాద్​ జిల్లాలో బస్సు బోల్తాపడి మహిళ మృతి..

Bus Overturns In Vikarabad District: ఆర్టీసీ బస్సు బోల్తాపడి మహిళ మృతి చెందిందిన ఘటన వికారాబాద్​ జిల్లా అనంతగిరి గుట్టలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. 20 మందికి స్పల్ప గాయాలయ్యాయి.

Bus Overturns In Vikarabad District: ఆర్టీసీ బస్సు బోల్తాపడి మహిళ మృతి చెందిందిన ఘటన వికారాబాద్​ జిల్లా అనంతగిరి గుట్టలో చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో ఐదుగురికి తీవ్ర గాయాలు కాగా.. 20 మందికి స్పల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నామని అధికారులు తెలిపారు. వికారాబాద్​ నుంచి దారుర్​ జాతరకు వెళ్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగిందని బస్సు డ్రైవర్​ పేర్కొన్నాడు.

సమాచారం తెలుసుకున్న చేవెళ్ల ఎంపీ రంజిత్​ రెడ్డి, వికారాబాద్​ ఎమ్మెల్యే ఆనంద్ ఘటనాస్థలానికి చేరుకుని సహాయచర్యలు చేపట్టారు. గాయపడిన వారిని అంబులెన్స్​లో ఆసుపత్రికి తరలించారు. మృతి చెందిన మహిళ స్వరూప(37)ను సికింద్రాబాద్​ ఇంద్రనగర్ నివాసిగా గుర్తించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.