గాంధీ ఆస్పత్రిలో దారుణం.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం!

author img

By

Published : Aug 16, 2021, 5:11 PM IST

Updated : Aug 16, 2021, 10:48 PM IST

గాంధీ ఆస్పత్రిలో దారుణం.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం!

17:08 August 16

గాంధీ ఆస్పత్రిలో దారుణం.. మత్తు మందు ఇచ్చి అత్యాచారం!

గాంధీ ఆస్పత్రిలో సిబ్బంది అత్యాచారం చేశారని మహిళ ఫిర్యాదు

గాంధీ ఆసుపత్రిలో ల్యాబ్ టెక్నీషియన్​గా పనిచేస్తోన్న ఉమామహేశ్వర్​ అనే వ్యక్తి తనపై, తన సోదరిపై అత్యాచారానికి పాల్పడ్డాడని మహబూబ్​నగర్​కు చెందిన ఓ మహిళ ఆరోపించింది. ఈ మేరకు చిలకలగూడ పోలీస్​స్టేషన్​లో ఆమె ఫిర్యాదు చేసింది.

తన బావ చికిత్స నిమిత్తం ఐదు రోజుల క్రితం గాంధీ ఆసుపత్రికి వచ్చినట్లు బాధితురాలు తెలిపింది. ల్యాబ్ టెక్నీషియన్​గా పనిచేస్తున్న ఉమా మహేశ్వర్ అనే వ్యక్తి మత్తు మందు ఇచ్చి తమపై అత్యాచారానికి పాల్పడి.. తన సోదరిని అపహరించాడని ఆమె ఆరోపించింది. ఇదే విషయమై మహబూబ్​నగర్​లో కేసు నమోదు కాగా.. విచారణ కోసం చిలకలగూడకు కేసును బదిలీ చేశారు.

చిలకలగూడ ఇన్స్​పెక్టర్​ బాధిత మహిళను విచారించారు. కేసు విషయమై విచారణ నిమిత్తం పోలీసులు బాధితురాలి కుటుంబ సభ్యులతో గాంధీ ఆసుపత్రికి వెళ్లారు.

ఇదీ చూడండి: Ramya Murder case : "ఇన్​స్టా' పరిచయమే ప్రాణం తీసింది.. ప్రజలు అడ్డుకుంటే బతికేదేమో"

Last Updated :Aug 16, 2021, 10:48 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.