tractor overturned: ట్రాక్టర్​లో ఇసుకను అన్​లోడ్​ చేసి వెళ్తున్నారు.. అంతలోనే..

author img

By

Published : Sep 14, 2021, 11:06 AM IST

tractor accident

ట్రాక్టర్​ బోల్తాపడి ఇద్దరు మృతిచెందారు. ఈ ఘటన భూపాలపల్లి జిల్లా గణపురం మండలం చెల్పూరు శివారులో జరిగింది.

జయశంకర్ భూపాలపల్లి జిల్లా, గణపురం మండలం చెల్పూరు శివారులో ప్రమాదం జరిగింది. సింగరేణి వెయ్యి క్వార్టర్స్​ సమీపంలో సోమవారం రాత్రి ట్రాక్టర్​ బోల్తాపడి ఇద్దరు మృతి చెందారు. భూపాలపల్లి మండలం గొర్లవీడు తండాకు చెందిన భూక్య రాజేందర్(27), జాటోతు రాంచరణ్ (20)ఇసుక కోసం సమీప అడవులకు ట్రాక్టర్​లో వెళ్లారు. ఇసుకను తీసుకొచ్చి వెయ్యి క్వార్టర్స్​ సమీపంలో దింపి భూపాలపల్లివైపు వెళ్తుండగా ప్రమాదం జరిగింది.

ట్రాక్టర్​ అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో ఇద్దరు ఘటనా స్థలిలోనే మృతి చెందారు. స్థానికులు సమాచారంతో ఘటనా స్థలికి చేరుకున్న పోలీసులు.. స్థానికులు, జేసీబీ సాయంతో మృతదేహాలను వెలికి తీసి ఆస్పత్రికి తరలించారు.

ఇదీ చూడండి: GHMC: హైదరాబాద్‌ రోడ్లపై భవన వ్యర్థాలు వేస్తున్నారా.. అయితే జాగ్రత్త!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.