భూవివాదంలో ఇరువర్గాల మధ్య ఘర్షణ, 10 మందికి గాయాలు

author img

By

Published : Aug 16, 2022, 4:57 PM IST

Updated : Aug 16, 2022, 5:23 PM IST

Fight

16:55 August 16

Fight in land issue భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఉయ్యాలవాడలో ఘర్షణ

Fight in land issue భూ వివాదం ఇరువర్గాల మధ్య చిచ్చుకు కారణమైంది. ఈ వివాదంలో రెండు గ్రూపులు ఘర్షణకు దిగడంతో పది మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిని అడ్డుకునేందుకు యత్నించిన ముగ్గురు పోలీసులకు సైతం స్వల్ప గాయాలయ్యాయి. ఈ ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లక్ష్మీదేవిపల్లి మండలం ఉయ్యాలవాడలో చోటు చేసుకుంది. అయితే ఈ ఘర్షణలో గాయపడిన వారిని వెంటనే కొత్తగూడెం ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దీంతో అప్రమత్తమైన పోలీసులు లక్ష్మీదేవిపల్లిలో 144 సెక్షన్ విధించారు.

ఇవీ చదవండి: హైదరాబాద్‌ శివారులో తెరాస నాయకులు కాల్పులు, వీడియో వైరల్

బిల్కిస్ బానో అత్యాచార నిందితుల విడుదలపై వివాదం, విపక్షాలు ఫైర్

Last Updated :Aug 16, 2022, 5:23 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.