నారాయణ పేట జిల్లా మక్తల్ మండలం టేకులపల్లి గ్రామ సమీపంలోని వ్యవసాయ క్షేత్రంలో రెండు జింకలు మృతి చెందాయి. స్థానిక రైతుల ద్వారా విషయం తెలుసుకున్న అటవీశాఖ అధికారులు ఘటనాస్థలానికి చేరుకొని పోస్టుమార్టం నిర్వహించారు. జింకలు ఎలా మృతి చెందాయనే విషయాన్ని సమీప రైతులను అడిగి తెలుసుకున్నారు.
టేకులపల్లి గ్రామ సమీపంలోని పొలాల్లో రెండు జింకలు సంచరిస్తుండగా... అక్కడే ఉన్న కుక్కలు జింకలను కొరికినట్లు తెలిపారు. తీవ్ర గాయాలపాలైన జింకలు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానిక రైతులు వివరించారు. పోస్టు మార్టం నిర్వహించిన వైద్యులు కూడా కుక్కలు దాడి చేయడం వల్ల జింకలు మృతి చెందినట్లు నిర్దారణ చేశారు. అక్కడే 2 జింకలను ఖననం చేశారు.
ఇదీ చూడండి: పోలీసులకు ఓ శునకం విన్నపం.. ఏంటంటే?