కంటైనర్​ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. డ్రైవర్​ మృతి, ఏడుగురికి గాయాలు

author img

By

Published : Jan 13, 2022, 7:09 AM IST

Updated : Jan 13, 2022, 7:32 AM IST

RTC Bus Accident at Jadcherla

07:06 January 13

RTC Bus Accident at Jadcherla : కంటైనర్​ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు.. పొగమంచే కారణం!

RTC Bus Accident at Jadcherla
కంటైనర్​ను ఢీకొట్టిన ఆర్టీసీ బస్సు

RTC Bus Accident at Jadcherla : మహబూబ్​నగర్​ జిల్లా జడ్చర్ల మండలం చిట్టిబోయినపల్లి వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. కంటైనర్​ను.. ఆర్టీసీ బస్సు వెనకనుంచి ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆర్టీసీ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా మరో ఏడుగురికి గాయాలయ్యాయి.

RTC Bus Hits Container at Jadcherla : తిరుపతి నుంచి హైదరాబాద్​ వెళ్తున్న తిరుపతి డిపో బస్సుకు ప్రమాదం జరిగింది. స్థానికుల సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు క్షతగాత్రులు ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన డ్రైవర్​ను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. డ్రైవర్ మృతితో.. ప్రయాణికులు తమ గమ్యస్థానాలకు చేరుకోవడానికి సమయం పట్టింది. మరో ఆర్టీసీ డ్రైవర్​ను రప్పించి ప్రయాణికులను వేరే బస్సులో వారి వారి గమ్యస్థానాలకు పంపించారు. ప్రమాదానికి గల కారణం పొగమంచేనని భావిస్తున్నారు. పొగమంచు వల్ల దారి కనబడక.. ఆర్టీసీ డ్రైవర్ కంటైనర్​ను ఢీకొట్టి ఉండొచ్చని అనుమానిస్తున్నారు.

Last Updated :Jan 13, 2022, 7:32 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.