BUS ACCIDENT: అలంపూర్​ వద్ద బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు... నలుగురికి తీవ్ర గాయాలు

author img

By

Published : Aug 17, 2021, 2:24 AM IST

Updated : Aug 17, 2021, 6:14 AM IST

tsrtc bus caught accident at alampur junction

కర్నూలు నుంచి హైదరాబాద్​కు వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. అలంపూర్​ చౌరస్తా సమీపంలో డివైడర్​ ఢీకొట్టటంతో బస్సు బోల్తాపడింది. ఈ ప్రమాదంలో నలుగురికి తీవ్ర గాయాలు కాగా.. మరో ఇద్దరు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను కర్నూలు ఆస్పత్రికి తరలించారు.

అలంపూర్​ వద్ద బోల్తాపడ్డ ఆర్టీసీ బస్సు... నలుగురికి తీవ్ర గాయాలు

జోగులాంబ గద్వాల జిల్లా జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు ప్రమాదానికి గురైంది. కాచిగూడకు చెందిన సూపర్​ లగ్జరీ బస్సు... 32 మంది ప్రయాణికులతో రాత్రి 11 గంటలకు ఏపీలోని కర్నూలు నుంచి హైదరాబాద్​కు బయలుదేరింది. ఉండవల్లి మండలం కంచుపాడు సమీపంలో డివైడర్​ను ఢీకొని బోల్తా పడింది. ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో 32 మంది ఉండగా.. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించారు. మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి.

బస్సు బలంగా డివైడర్​ను ఢీకొట్టడం వల్ల బస్సు రాడ్డు విరిగి వెనక వస్తున్న కారులోకి దూసుకుపోయింది. ఈ ఘటనలో కారులో వెంటనే ఎయిర్ బెలూన్​లు తెరుచుకోవటం వల్ల.. అందులో ఉన్న ఇద్దరు ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. ప్రమాద ఘటనలో ఎలాంటి ప్రాణ హాని జరగకవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు, హైవే సిబ్బంది... రహదారిపై రాకపోకలను పునరుద్ధరించారు. మిగిలిన ప్రయాణికులను వేరువేరు వాహనాల్లో వారి వారి గమ్యస్థానాలకు పంపించారు.

ఇదీ చూడండి:

CM KCR: ప్రభుత్వ ఉద్యోగులకూ దళితబంధు.. కాంట్రాక్టుల్లోనూ రిజర్వేషన్

Last Updated :Aug 17, 2021, 6:14 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.