టిప్పర్లో మంటలు చెలరేగిన ఘటనలో వాహనం ఇంజిన్, ముందుభాగం పూర్తిగా దగ్ధమయ్యాయి. డ్రైవర్ అప్రమత్తంగా వ్యవహరించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ ఘటన కరీంనగర్ జిల్లా శంకరపట్నం మండలం తాడికల్ గ్రామశివారులో జరిగింది.
కరీంనగర్ వెళ్తుండగా ప్రమాదం
హుజూరాబాద్ నుంచి కరీంనగర్వైపు వెళ్తున్న టిప్పర్లో ప్రమాదవశాత్తు మంటలు చెలరేగాయి. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ అగ్నిమాపకశాఖ సిబ్బందికి సమాచారం అందించారు. హుటాహుటిన అక్కడకి చేరుకున్న అగ్నిమాపకశాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. అప్పటికే టిప్పర్ ఇంజిన్, ముందుభాగం మంటల్లో పూర్తిగా కాలిపోయింది. ఈ ప్రమాదంలో ప్రాణాపాయం తప్పడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. అయితే విద్యుదాఘాతంతోనే మంటలు చెలరేగినట్లు అగ్నిమాపకశాఖ అధికారులు అంచనా వేస్తున్నారు.
ఇదీ చూడండి: ACCIDENT: కాల్వలోకి దూసుకెళ్లిన కారు.. విద్యార్థిని మృతి.. ఏడుగురికి గాయాలు