పేపర్​ ప్లేట్ల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..

author img

By

Published : Sep 21, 2022, 6:21 AM IST

Updated : Sep 21, 2022, 9:08 AM IST

భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు సజీవదహనం

06:19 September 21

భారీ అగ్నిప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..

పేపర్​ప్లేట్ల తయారీ పరిశ్రమలో అగ్నిప్రమాదం.. ముగ్గురు దుర్మరణం..

Fire Accident in Paper Plates Manufacturing Industry: ఆంధ్రప్రదేశ్​లోని చిత్తూరు జిల్లా కేంద్రంలో గల రంగాచారి వీధిలో పేపర్‌ ప్లేట్ల తయారీ పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. అర్ధరాత్రి పరిశ్రమలో మంటలు చెలరేగి.. ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. మృతుల్లో పరిశ్రమ యజమాని భాస్కర్‌, ఆయన కుమారుడు దిల్లీ బాబు, బాలాజీ అనే మరో వ్యక్తి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ప్రమాద సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపు చేశారు.

షార్ట్‌ సర్క్యూట్‌ కారణంగా ఈ అగ్నిప్రమాదం జరిగి ఉండవచ్చునని పోలీసులు భావిస్తున్నారు. మూడంతస్థుల భవనంలోని కింది అంతస్తులో పేపర్​ ప్లేట్ల తయారీ యూనిట్​ నిర్వహిస్తున్నారు. కింది అంతస్థు నుంచి భవనం మొత్తానికి మంటలు వ్యాపించాయి. ఆ మంటల్లో చిక్కుకుని ముగ్గురు మృతి చెందారు. పరిశ్రమ యజమాని భాస్కర్‌ కుమారుడు దిల్లీ బాబు సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​. జన్మదినం రోజే అతను మృతి చెందడంతో బంధువులు తీవ్ర విషాదంలో ఉన్నారు.

ఇవీ చూడండి.. నెల్లూరులో కలకలం.. కేబుల్ వైర్లకు వేలాడుతూ మృతదేహం

Last Updated :Sep 21, 2022, 9:08 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.