Accidents: వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం

author img

By

Published : Sep 19, 2021, 11:23 AM IST

Updated : Sep 19, 2021, 11:37 AM IST

నల్గొండ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో  ఐదుగురు దుర్మరణం

11:19 September 19

నల్గొండ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం

నల్గొండ జిల్లాలో వేర్వేరు ప్రమాదాల్లో ఐదుగురు దుర్మరణం చెందారు. కట్టంగూర్ మం. ముత్యాలమ్మగూడెం శివారులో రెండు రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ముత్యాలమ్మగూడెం వద్ద కారు కంటైనర్‌ను ఢీకొని చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో కారులో ప్రయాణిస్తున్న ముగ్గురు అక్కడిక్కడే మృతి చెందారు. హైదరాబాద్‌ నుంచి విజయవాడ వెళ్తుండగా కారు ప్రమాదానికి గురైంది. ముత్యాలమ్మగూడెం వద్ద మరో ప్రమాదంలో ఇద్దరు మృతి మృతి చెందారు. ఆగిఉన్న లారీని కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడిక్కడే మృతి చెందారు. కేసులు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 


 

Last Updated :Sep 19, 2021, 11:37 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.