వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన గుడిసెల తొలగింపు

author img

By

Published : Aug 30, 2022, 3:39 PM IST

Updated : Aug 30, 2022, 4:52 PM IST

Huts demolition

Huts demolition in Warangal వరంగల్ జిల్లా బొల్లికుంటలో గుడిసెల తొలగింపులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. ప్రభుత్వ భూమిలో పేదలు వేసుకున్న గుడిసెలను పోలీసుల సాయంతో రెవెన్యూ అధికారులు రాత్రికి రాత్రే తొలగించారు. అధికారులు అక్రమంగా తమ గుడిసెలు తొలగించారంటూ వరంగల్‌ ఖమ్మం జాతీయ రహాదారిపై బాధితులు ధర్నాకు దిగారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

Huts demolition in Warangal: వరంగల్ జిల్లా బొల్లికుంటలో ప్రభుత్వ స్థలంలో వేసుకున్న గుడిసెల తొలగింపు తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. సీపీఐ అధ్వర్యంలో ఆరు నెలల క్రితం గూడు వేసుకున్నారు. ఇప్పుడు అధికారులు అక్రమంగా తమ గుడిసెలు తొలగించారంటూ వరంగల్‌ ఖమ్మం జాతీయ రహాదారిపై బాధితులు ధర్నా చేపట్టారు. దీంతో పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు.

అంతకుముందు అధికారులు పెద్దఎత్తున పోలీసులను మోహరించి జేసీబీలతో గుడిసెల తొలగింపును పూర్తి చేశారు. అనంతరం వాటికి నిప్పంటించారు. పేదలు సీపీఐ ఆధ్వర్యంలో ఆరు నెలలక్రితం సర్వే నెంబర్ 476, 484 లో గుడిసెలు వేసుకున్నారు. ఇప్పుడు అధికారులు వాటిని తొలగించడంతో నిలువ నీడ లేక బిక్కుబిక్కుమంటున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి తమకు రెండుపడకల గదులు కేటాయించి ఆదుకోవాలని డిమాండ్‌ చేస్తున్నారు. నిలువ నీడ లేక తమ బతుకులు రోడ్డున పడ్డాయని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు.

వరంగల్‌లో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసిన గుడిసెల తొలగింపు

'6 నెలలుగా ఇక్కడే జీవిస్తున్నాం. ఎలాంటి సమాచారం ఇవ్వకుండా రాత్రికి రాత్రే పెట్రోల్ పోసి తగలపెట్టారు. అడ్డుకున్న వారిని ఆడవాళ్లు అని కూడా చూడకుండా డీసీఎంలలో ఎక్కించి పోలీస్ స్టేషన్​కి తీసుకెళ్లారు. ప్రభుత్వ భూమి అని తెలిసే 6 నెలల క్రితం సీపీఐ అధ్వర్యంలో గుడిసెలు వేసుకున్నాం. ఇప్పుడు ఎలాంటి ముందస్తు సమాచారం లేకుండా గుడిసెలను కూల్చి వేయడం అన్యాయం. కనీసం ఇంట్లోని సామాన్లు తరలించుకునేందుకు కూడా సమయం ఇవ్వరా..? రాత్రికి రాత్రే తొలగించారు. నిలువ నీడ లేక ఇప్పుడు రోడ్డున పడ్డాం'-బాధితులు

ఇవీ చదవండి:

Last Updated :Aug 30, 2022, 4:52 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.