'కథ బాగుంది.. రాత్రుళ్లు కలిస్తే ఇంకా బాగుంటుంది..'

author img

By

Published : May 20, 2022, 8:21 AM IST

మహిళలపై వేధింపులు

తన కోర్కెలు తీర్చకుంటే సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కకుండా చేస్తా అంటూ మహిళా కథా రచయితను ఓ సినీ నిర్మాత బెదిరించాడు. దీంతో ఆమె గోల్కొండ పోలీస్​ స్టేషన్​లో ఫిర్యాదు చేసింది. ఆ తర్వాత ఏమైందంటే..

నీ కథ బాగుంది... సినిమా తీసేందుకు అవసరమైనన్ని సన్నివేశాలున్నాయి. కథను మరింతగా మెరుగు పరిచేందుకు మనం రాత్రుళ్లు చర్చించుకుందాం. ఫైవ్‌స్టార్‌ హోటల్‌కు వెళ్తే అక్కడ ఆహ్లాదకరమైన వాతావరణం ఉంటుంది. అక్కడ తన కోర్కెలు తీర్చలేదనుకో.. సినీ పరిశ్రమలో అవకాశాలు దక్కకుండా చేస్తా అంటూ మహిళా కథా రచయితను బెదిరించిన సినీ నిర్మాతపై గోల్కొండ పోలీసులు కేసు నమోదు చేశారు.

సినీ నిర్మాత వైఖరితో భయపడిన బాధితురాలు తొలుత ‘షి’బృందానికి ఫిర్యాదు చేయగా ఆమెను భరోసా కేంద్రానికి పిలిపించారు. డీసీపీ శిరీష రాఘవేంద్ర స్వయంగా బాధితురాలితో మాట్లాడి గోల్కొండ పోలీసులకు ఫిర్యాదు చేయించారు.

ఆరునెలల క్రితం.. ఆన్‌లైన్‌లో పరిచయం

హైదరాబాద్‌లో ఉంటున్న మహిళా కథా రచయిత తన వద్ద ఉన్న కథను సినిమాగా తెరకెక్కించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. ఆరునెలల క్రితం ఒక సినీ నిర్మాత ఆన్‌లైన్‌లో పరిచయమయ్యాడు. విభిన్న నేపథ్యమున్న కథలు, సంఘటనలను సినిమాలుగా తీస్తానని, ఖర్చు ఎంతైనా ఇబ్బంది లేదంటూ మహిళా రచయితకు చెప్పాడు. కథ, సన్నివేశాల ప్రతిని ఆమె నిర్మాతకు అందచేశారు. కథను చదువుతానంటూ చెప్పిన నిర్మాత ఆమె ఫోన్‌ చేసినప్పుడల్లా తర్వాత మాట్లాడదాం అనేవాడు. కొద్దిరోజుల క్రితం అతడే ఆమెకు ఫోన్‌ చేశాడు. కథ బాగుంది.. రాత్రుళ్లు కలిస్తే ఇంకా బాగుంటుదని అన్నాడు.అప్పటి నుంచి వరుసగా రాత్రుళ్లు ఫోన్లు చేసి లైంగిక కోర్కెలు తీర్చాలని.. లేదంటే ఒక్క సినిమాకు రాయకుండా అడ్డుకుంటానంటూ ఆమెను బెదిరించాడు. బాధితురాలు భయంతో పోలీసులను ఆశ్రయించగా.. నిర్మాతను అదుపులోకి తీసుకుని గోల్కొండ పోలీసులకు అప్పగించారు.

నాలుగు నెలల్లో 423 ఫిర్యాదులు..

  • బెదిరింపులు, ఈవ్‌టీజింగ్‌లతో తమను భయపెడుతున్నారంటూ నాలుగునెలల్లో 423మంది బాధితులు ‘షి’బృందాలను ఆశ్రయించారు. ఇందులో 203 మంది నేరుగా రాగా.. 181మంది 9490616555 నంబర్‌కు వాట్సాప్‌ చేశారు. మిగిలిన 39మంది సామాజిక మాధ్యమాల ద్వారా ఫిర్యాదు చేశారని డీసీపీ శిరీష రాఘవేంద్ర తెలిపారు.
  • ‘షి’బృందాలను ఆశ్రయించిన వారి ఫిర్యాదులను పరిశీలించిన పోలీసులు 57 కేసులను నమోదు చేయించారు. ఈవ్‌టీజింగ్‌కు పాల్పడుతున్న 52మందిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 15మందిపై పెట్టీకేసులు నమోదు చేశారు. నగరంలోని వేర్వేరు ప్రాంతాల్లో ఈవ్‌టీజింగ్‌ పాల్పడుతున్న 191మంది పురుషులు, 23మంది బాలురకు కౌన్సిలింగ్‌ నిర్వహించారు.
  • చార్మినార్‌ ఠాణా పరిధిలో నివాసముంటున్న ఒక యువతిని తీవ్రంగా వేధిస్తున్న సయ్యద్‌ అబ్దుల్‌ హసన్‌ను అరెస్ట్‌చేసి కోర్టులో హాజరిచారు. కోర్టు అతడికి 8 రోజుల జైలుశిక్ష, రూ.250 జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది.
  • సంతోష్‌ నగర్‌ క్రాస్‌రోడ్స్‌ సమీపంలోని ఓ కళాశాల వద్ద ఈవ్‌టీజింగ్‌ చేస్తున్న మహ్మద్‌ సొహైల్‌ను అరెస్ట్‌ చేశారు. కోర్టులో హాజరుపరచగా అతనికి 8 రోజుల జైలుశిక్ష విధిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
  • నిన్నూ, నీభర్తను చంపేస్తానంటూ నిత్యం ఫోన్లు, సందేశాలతో ఒక యువతిని బెదిరిస్తున్న ఇ.శ్రీనివాస్‌ను ‘షి’బృందం పోలీసులు ఓయూ ఠాణాలో అప్పగించారు.
  • సంతోష్‌నగర్‌లో ఉంటున్న ఒక యువతిని బ్లాక్‌మెయిల్‌ చేస్తున్న షేక్‌ మోతిషామ్‌ అహ్మద్‌ను ‘షి’బృందం పోలీసులు అదుపులోకి తీసుకుని సంతోష్‌నగర్‌ పోలీసులకు అప్పగించారు.

ఇదీ చదవండి: వావివరసలు మరిచిన కామాంధుడు.. చెల్లెలిపై ఆరు నెలలుగా అత్యాచారం

ప్రాణం తీసిన ఈత సరదా.. తొమ్మిది మంది మృతి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.