BRIDE SUICIDE: అప్పగింతలు కాకుండానే నవవధువు ఆత్మహత్య

author img

By

Published : May 14, 2022, 10:23 AM IST

BRIDE SUICIDE: అప్పగింతలు కాకుండానే నవవధువు ఆత్మహత్య

BRIDE SUICIDE: ఉదయం బంధువులు, మిత్రుల సమక్షంలో పెళ్లి బాజాలు మోగిన ఆ ఇంట్లో.. సాయంత్రానికి చావు డబ్బులు వినిపించాయి. తనకు ఇష్టంలేని పెళ్లి చేశారని ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. అప్పటి వరకు వరుడితో కలిసి స్టెప్పులేసి.. అంతలోనే అనంతలోకాలకు చేరుకుంది. ఈ విషాద ఘటన మహబూబ్​నగర్​లో చోటుచేసుకుంది.

BRIDE SUICIDE: మహబూబ్​నగర్​ జిల్లా కేంద్రంలో విషాదం చోటుచేసుకుంది. ఇష్టంలేని పెళ్లి చేశారని.. అప్పగింతలు కాకముందే.. ఓ నవ వధువు బలవన్మరణానికి పాల్పడింది. వివరాల్లోకి వెళితే.. మహబూబ్​నగర్​లోని పాతతోటకు చెందిన గజ్జల పద్మకు నలుగురు కూతుళ్లు, ఓ కుమారుడు ఉన్నారు. పిల్లలు చిన్నవారుగా ఉన్నప్పుడే భర్త మరణించడంతో కూలీ పనులు చేస్తూ పిల్లలను చదివించింది.

తన పెద్ద కూతురు లక్ష్మి(19)కి పెళ్లి చేయాలని నిశ్చయించి.. దూరపు బంధువు అయిన ఏపీలోని అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన యువకునితో పెళ్లి సంబంధం ఖాయం చేసింది. అంత దూరం సంబంధం చేసుకోవడం తనకు ఇష్టం లేదని తల్లితో పలుమార్లు చెప్పినప్పటికీ.. లక్ష్మికి నచ్చజెప్పి వివాహానికి ఒప్పించారు. శుక్రవారం ఉదయం బంధువులు, మిత్రుల సమక్షంలో వైభవంగా పెళ్లి జరిపించారు. వివాహం అనంతరం వరుడితో కలిసి లక్ష్మి నృత్యాలు సైతం చేసింది.

అంతలోనే సాయంత్రం అప్పగింతలకు ముందు లక్ష్మి విషం తాగింది. అనంతరం తనకు కడుపులో నొప్పిగా ఉందని తన తల్లి, ఇతర కుటుంబసభ్యులకు తెలిపింది. వారు లక్ష్మిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. విషం తీసుకోవడం వల్లే చనిపోయిందని నిర్ధారించారు. తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేస్తున్నారు.

ఇవీ చదవండి..
Sexual Harassment: 'నా కోరిక తీర్చితే... దస్త్రం మీద సంతకం చేస్తా'

ఫేస్​బుక్​ క్రైం కథలో కొత్త కోణం.. చంపొద్దని శ్వేతారెడ్డి మెస్సేజ్​.. కానీ..!!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.