Cyber Crime in Telangana: తెలంగాణలో సైబర్​ నేరాలు.. ఝార్ఖండ్​లో అరెస్ట్​.!

author img

By

Published : Jan 14, 2022, 5:05 PM IST

cyber crime

Cyber Crime in Telangana: ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 73 సైబర్​ నేరాలు.. పోలీసులకు చిక్కకుండా ఎంతో చాకచక్యంగా చేశారు. ఇవన్నీ మళ్లీ వేరు వేరు రాష్ట్రాల్లో చేసినవి అనుకుంటే పొరపాటే. కానే కాదు. ఒక్క మన రాష్ట్రంలోనే 11 మంది సభ్యుల ముఠా ఇన్ని మోసాలు చేసి.. చివరికి ఝార్ఖండ్​ పోలీసులకు పట్టుబడ్డారు. వారిని త్వరలో తెలంగాణ పోలీసులకు అప్పగించనున్నారు.

Cyber Crime in Telangana: 73 సైబర్​ నేరాలు చేసి ఝార్ఖండ్​ పోలీసులకు పట్టుబడిన సైబర్​ నేరగాళ్లను తెలంగాణకు తరలించేందుకు నేడు రాష్ట్ర పోలీసులు ఝార్ఖండ్​కు చేరుకున్నారు. 19 సెప్టెంబర్ 2021 న, ఝార్ఖండ్​లోని సదర్ పోలీస్ స్టేషన్ పరిధిలో 11 మంది సైబర్ నేరగాళ్లను అక్కడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిపై

ఎఫ్​ఐఆర్​ నమోదు చేసి అరెస్ట్ చేసి కోర్టులో హాజరు పరిచారు. అనంతరం ధన్​బాద్​ జైలుకు తరలించారు. వీరంతా తెలంగాణలో నమోదైన 73 సైబర్​ నేరాల్లో నిందితులుగా ఉన్నారు. సదర్​ పోలీసుల సమాచారం మేరకు రాష్ట్ర పోలీసులు అక్కడికి చేరుకున్నారు. కోర్టు నుంచి ట్రాన్సిట్​ రిమాండ్​ పొందిన అనంతరం వారిని తెలంగాణ పోలీసులకు అప్పగించనున్నారు.

మోసాల్లో రాటుదేలారు

అరెస్టయిన సైబర్ నేరగాళ్ల నుంచి 24 మొబైల్స్, సిమ్‌లను ఝార్ఖండ్​ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వీటితో పాటు రెండు నోట్‌బుక్‌లు, రెండు ల్యాప్‌టాప్‌లు కూడా స్వాధీనం చేసుకున్నారు. ల్యాప్‌టాప్‌లు, మొబైల్స్​ ద్వారా నిందితులు తెలంగాణలో సైబర్​ మోసాలకు పాల్పడినట్లు అక్కడి పోలీసులు తెలిపారు. విచారణలో ఈ నేరగాళ్లు పది కేసులను మాత్రమే అంగీకరించినట్లు వెల్లడించారు. కానీ తమదైన శైలిలో విచారణ చేపట్టగా మొత్తం 73 మోసాలకు పాల్పడినట్లు తెలిపారు. ఈ ముఠాలో ప్రధాన సూత్రధారి బీహార్‌లోని గయాకు చెందిన విక్రమ్​ అని వివరించారు.

ఇదీ చదవండి: హైదరాబాద్​లో భారీ చోరీ.. 2 కిలోల నగలు, 25 లక్షల నగదు ఎత్తుకెళ్లిన దొంగలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.