'ఆ బాలికపై యాసిడ్‌ దాడి చేసింది మేనమామే..'

author img

By

Published : Sep 7, 2022, 5:43 PM IST

Nlr sp on acid incident

Acid Attack case: ఏపీ నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలంలోని ఓ గ్రామంలో మైనర్‌ బాలికపై యాసిడ్‌ దాడి ఘటన తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే, 14 ఏళ్ల బాలికపై దాడికి పాల్పడింది ఆమె మేనమామ నాగరాజేనని పోలీసులు వెల్లడించారు. డబ్బు కోసమే నిందితుడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు తెలిపారు.

Nellore SP: ఆంధ్రప్రదేశ్ నెల్లూరులో బాలికపై దాడి కేసులో మేనమామనే నిందితుడిగా పోలీసులు తేల్చారు. చాకుతో మేనమామే బాలికపై దాడి చేశాడని ఎస్పీ విజయరావు వెల్లడించారు. సంఘటన జరిగిన తర్వాతే పోలీసులకు సమాచారం వచ్చిందన్నారు. తాను కూడా జీజీహెచ్‌కు వెళ్లి బాలికను పరామర్శించినట్లు తెలిపారు. బాలికను చెన్నైలోని చిల్డ్రన్స్ అపోలో ఆస్పత్రికి తరలించారని తెలిపారు. ఇంట్లో ఉన్న బాత్రూం యాసిడ్‌తో నిందితుడు దాడి చేశాడని పేర్కొన్నారు. చెవిదిద్దులు ఇవ్వాలని బాలికపై దాడి చేశాడని వివరించారు. నాగరాజుకు త్వరగా శిక్షపడేలా చూస్తామన్నారు. నిందితుడు నాగరాజుపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేశామని స్పష్టం చేశారు. మద్యం మత్తులోనే నాగరాజు బాలికపై దాడి చేశాడని ఎస్పీ చెప్పారు. ఈ మేరకు మీడియాకు ఎస్పీ వివరాలు వెల్లడించారు.

"చాకుతో మేనమామే బాలికపై దాడి చేశాడు. సంఘటన జరిగిన తర్వాతే పోలీసులకు సమాచారం వచ్చింది. నేను కూడా జీజీహెచ్‌కు వెళ్లి బాలికను పరామర్శించాను. బాలికను చెన్నైలోని చిల్డ్రన్స్ అపోలో ఆస్పత్రికి తరలించాం. ఇంట్లో ఉన్న బాత్రూం యాసిడ్‌తో నిందితుడు దాడి చేశాడు. చెవిదిద్దులు ఇవ్వాలని.. బాలికపై దాడి చేశాడు. నాగరాజుకు త్వరగా శిక్షపడేలా చూస్తాం. నిందితుడు నాగరాజుపై రౌడీషీట్‌ ఓపెన్‌ చేశాం. మద్యం మత్తులోనే నాగరాజు బాలికపై దాడి చేశాడు." -విజయరావు, నెల్లూరు ఎస్పీ

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.