Road accident: ఆటో, కారు ఢీ.. ఇద్దరి పరిస్థితి విషమం

author img

By

Published : Aug 8, 2021, 7:36 PM IST

Updated : Aug 8, 2021, 7:47 PM IST

Road accident

నాగర్​ కర్నూల్​ జిల్లాలో ఘోర ప్రమాదం(Road accident) చోటుచేసుకుంది. అచ్చంపేట రహదారిపై ఎదురెదురుగా వస్తున్న కారు, ఆటో ఢీ కొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఆరుగురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులకు స్థానిక ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు.

నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట మండలం బుడ్డ తండా గేటు వద్ద కారు, ఆటో ఢీకొన్నాయి. ఇద్దరి పరిస్థితి విషమంగా మారింది. ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలయ్యాయి. అచ్చంపేట నుంచి ఐనవోలు వెళ్తున్న ఆటో.. శ్రీశైలం నుంచి హైదరాబాద్ వెళ్తున్న కారు ఎదురెదురుగా వస్తూ ఢీకొన్నాయి.

ఈ ఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న ఎనిమిది మందికి గాయాలయ్యాయి. వారిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండటంతో అత్యవసరంగా హైదరాబాద్​లోని ఆస్పత్రికి తరలించారు. మిగిలిన వారికి అచ్చంపేట ప్రభుత్వాస్పత్రిలో చికిత్స అందిస్తున్నారు. ప్రమాదానికి గల కారణాలను పోలీసులు విశ్లేషిస్తున్నారు. క్షతగాత్రులు కొరతండా ఐనవోలు గ్రామానికి చెందినవారిగా గుర్తించారు. క్షతగాత్రుల్లో ఐదుగురు మహిళలు, ముగ్గురు పురుషులు ఉన్నారు.

ఇదీ చదవండి: REVANTH REDDY: 'ఇంద్రవెల్లి సభను విజయవంతం చేయండి'

Last Updated :Aug 8, 2021, 7:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.