గొర్లు, మేకలు ఎత్తుకెళ్తున్న యువకులు.. దేహశుద్ధి చేసిన స్థానికులు

author img

By

Published : Aug 15, 2021, 5:55 PM IST

thieves

గొర్లు, మేకలు ఎత్తుకెళ్లడానికి యత్నించిన ముగ్గురు దొంగలను పట్టుకుని చితకబాదిన ఘటన ములుగు జిల్లా రమనక్కపేటలో జరిగింది. ఆ ముగ్గురిని పోలీస్​ స్టేషన్​లో అప్పగించారు.

ములుగు జిల్లా మంగపేట మండలం రమనక్కపేటలో గత కొంతకాలంగా కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు గొర్లు, మేకలను ఎత్తుకెళ్తున్నారు. వారం రోజుల క్రితం కూడా కొంత మంది మేకలను అపహరించుకుపోయారు. ఇదిలా ఉండగా నిన్న రాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో ముగ్గురు యువకులు మేకలు, గొర్లను ఎత్తుకెళ్లడానికి యత్నించారు. వెంటనే గమనించిన యజమాని కేకలు పెట్టారు.

అక్కడికి చేరుకున్న గ్రామస్థులు దొంగలను పట్టుకొని చెట్టుకు కట్టేసి దేహశుద్ధి చేశారు. దొంగతనానికి యత్నించిన ముగ్గురు యువకులు మణుగూరు మండలంలోని రామానుజపురం గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. వారిని మంగపేట పోలీస్​ స్టేషన్​లో అప్పగించారు.

ఇదీ చదవండి: Unnatural Sexual Offence: గేదెతో కామాంధుడు సెక్స్​.. చితకబాదిన స్థానికులు

'కామాంధుడు బర్రెనూ వదల్లేదు.. దాని తోకతోనే మెడకు ఉరి..!'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.