సీఎం సొంత జిల్లాలో దారుణం.. ట్రాన్స్ జెండర్​పై 15మంది అత్యాచారం

author img

By

Published : Jul 21, 2022, 2:15 PM IST

RAPE ON TRNASGENDER

RAPE ON TRNASGENDER: కామంతో రెచ్చిపోతున్న కొందరు మగాళ్లకు ఆడది కనబడితే చాలు వాళ్లల్లో ఉన్న మృగం బయటికి వస్తుంది. చిన్నా, పెద్దా అనే తేడా లేకుండా అత్యాచారాలకు పాల్పడుతున్నారు. ఆఖరికి ట్రాన్స్​జెండర్లను కూడా వదలడం లేదు. తాజాగా 15 మంది కలిసి ఓ ట్రాన్స్​జెండర్​పై అత్యంత పాశవికంగా అత్యాచారం చేసి ముళ్ల కంపలో పడేసిన దారుణ ఘటన ఏపీలోని పులివెందులలో చోటుచేసుకుంది.

RAPE ON TRNASGENDER: ఆంధ్రప్రదేశ్​లోని వైఎస్సార్​ జిల్లా పులివెందులలో దారుణం చోటుచేసుకుంది. పట్టణంలోని ఆంజనేయస్వామి విగ్రహం వద్ద ట్రాన్స్ జెండర్​పై 15మంది అత్యాచారం చేసి.. కంప చెట్లలో పడేశారని తోటి ట్రాన్స్​జెండర్లు వెల్లడించారు. ఈ విషయమై ఫిర్యాదు చేసేందుకు పోలీస్​స్టేషన్​కు వెళ్తే పట్టించుకోలేదని.. దాంతో దిశ యాప్​కు కాల్ చేశామని చెప్పారు.

దిశ అధికారుల ఆదేశాల మేరకు పులివెందుల పోలీసులు స్పందించారని తెలిపారు. ఈ విషయంలో తమకు న్యాయం చేయకపోతే అంతా కలిసి ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. తమను చిన్న చూపు చూస్తున్నారని.. సమాజంలో బతికే హక్కు తమకు ఉందని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.