అక్రమంగా తీసుకొచ్చారని రూ.ఐదున్నర కోట్ల విలువైన మద్యం ధ్వంసం చేశారు..

author img

By

Published : Sep 15, 2022, 3:48 PM IST

Updated : Sep 15, 2022, 4:59 PM IST

Alcohol bottles

Alcohol bottles Destroyed in Ntr District: ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా రవాణా అవుతున్న మద్యాన్ని పట్టుకున్న ఏపీ పోలీసులు.. దానిని ధ్వంసం చేశారు. ఏడాది కాలంగా పట్టుకున్న మద్యాన్ని ఒకేసారి ధ్వంసం చేశారు. దీని విలువ సుమారు ఐదున్నర కోట్లుగా ఉంటుందని పోలీసుల అంచనా.

అక్రమంగా తీసుకొచ్చారని రూ.5.75కోట్ల విలువైన మద్యం ధ్వంసం చేశారు..

Alcohol bottles Destroyed in Ntr District: రెండేళ్లలో తెలంగాణ నుంచి అక్రమంగా రవాణా చేస్తూ పోలీసులకు దొరికిన రూ. 5.47 కోట్ల విలువైన మద్యం సీసాలను ఆంధ్రప్రదేశ్ పోలీసులు ధ్వంసం చేశారు. తోటచర్ల జాతీయ రహదారి పక్కనున్న ప్రైవేటు వెంచరులో సీపీ కాంతిరాణా టాటా, డీసీపీ మేరీ ప్రశాంతి, ఎస్‌ఈబీ ఏఎస్పీ సత్తిబాబు పర్యవేక్షణలో మద్యం సీసాలను ధ్వంసం చేశారు.

నందిగామ సబ్‌ డివిజన్‌ పరిధిలో మద్యం అక్రమ రవాణాకు సంబంధించి పలు పోలీస్‌స్టేషన్లలో 6,075 కేసులు నమోదు అయినట్లు సీపీ కాంతిరాణా టాటా తెలిపారు. వివిధ బ్రాండ్లకు చెందిన 2,43,385 మద్యం సీసాలు పట్టుకున్నట్లు చెప్పారు. ఒకేసారి రూ.5.47 కోట్ల విలువైన మద్యం సీసాలను ధ్వంసం చేయడం రాష్ట్రంలో ఇదే మొదటిసారి అని చెప్పారు.

చూసేందుకు తరలివచ్చిన జనం: రోడ్డుపై సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరం వరకు సీసాలు పెట్టారు. మూడు రోలర్లతో ధ్వంసం చేశారు. ఆ ప్రక్రియను చూసేందుకు తోటచర్లతో పాటు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు పెద్దఎత్తున తరలివచ్చారు. కార్యక్రమంలో ఎక్సైజ్‌ సూపరిండెంటెండ్‌ పి.నారాయణస్వామి, నందిగామ ఏసీపీ నాగేశ్వరరెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

ఇవీ చదవండి:

Last Updated :Sep 15, 2022, 4:59 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.