రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్​ఐఏ సోదాలు.. ఆ సంబంధాలే కారణమా.!

author img

By

Published : Sep 5, 2022, 1:08 PM IST

Updated : Sep 5, 2022, 3:21 PM IST

NIA Raids

NIA Raids: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు నిర్వహించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై హైదరాబాద్​లోని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి, కృష్ణా జిల్లాలోని కో కన్వీనర్ రాధ, హన్మకొండలోని సభ్యురాలు ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. మావోయిస్టు రిక్రూట్‌మెంట్‌ కేసులోనే ఈ సోదాలు కొనసాగుతున్నాయి.

NIA Raids: రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) అధికారులు సోదాలు జరిపారు. 2017లో నర్సింగ్ విద్యార్దిని అదృశ్యం కేసులో ఎన్​ఐఏ అధికారులు... హైదరాబాద్, హన్మకొండ, కృష్ణా జిల్లాలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. మావోయిస్టులతో సంబంధాలు ఉన్నాయన్న ఆరోపణలపై హైదరాబాద్​లోని చైతన్య మహిళా సంఘం రాష్ట్ర కన్వీనర్ జ్యోతి ఇంట్లో 5 గంటలపాటు తనిఖీలు చేశారు. ఇంట్లోని పుస్తకాలు పరిశీలించారు. జ్యోతికి సంబంధించిన డైరీలు స్వాధీనం చేసుకున్నారు. పత్రికకు సంబంధించిన వివరాలు, సబ్‌స్క్రైబ్ చేసుకున్న వారి వివరాలు సేకరించారు.

హైదరాబాద్‌లోని కన్వీనర్ జ్యోతి ఇంటితోపాటు కృష్ణా జిల్లాలోని కో కన్వీనర్ రాధ, హన్మకొండలోని సభ్యురాలు ఇళ్లలో తనిఖీలు నిర్వహించారు. పలు డైరీలు, పుస్తకాలు స్వాధీనం చేసుకున్నారు. తమ కుమార్తె రాధను నర్సింగ్‌ చదివిస్తామని 2017లో హైదరాబాద్‌ నుంచి నరేందర్‌ అనే వ్యక్తి తీసుకువెళ్లాడని అప్పటి నుంచి ఆమె కనిపించకుండా పోయిందని యువతి తల్లి పోచమ్మ ఈ ఏడాది జనవరిలో ఫిర్యాదు చేశారు. జూన్‌ 3న ఎన్​ఐఏ మరో కేసు నమోదు చేసి... దర్యాప్తు ప్రారంభించింది. అప్పట్లో చైతన్య మహిళ సంఘంలో పనిచేసిన శిల్ప, దేవేంద్ర, స్పప్న, నరేందర్‌ నివాసాల్లో ఎన్‌ఐఏ సోదాలు జరిపింది. ఇదే కేసులో మరోసారి సోదాలు జరుపుతున్నారు.

రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఎన్​ఐఏ సోదాలు.. ఆ సంబంధాలే కారణమా.!

ఇవీ చదవండి:

Last Updated :Sep 5, 2022, 3:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.