Live Murder: వంతెనపై కిరాతకంగా హత్య చేశారు

author img

By

Published : Sep 9, 2021, 4:46 PM IST

Murder

వంతెనపై ఓ వ్యక్తిని కిరాతకంగా హత్య చేసిన ఘటన ఏపీలోని చిత్తూరు జిల్లాలోని శ్రీకాళహస్తిలో జరిగింది. హత్యకు పాత కక్షలే కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.

Live Murder: వంతెనపై కిరాతకంగా హత్య చేశారు

ఏపీలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తిలో రౌడీషీటర్ దారుణ హత్యకు గురయ్యాడు. ఇమ్రాన్​ఖాన్(28)ను మంగళవారం రాత్రి భక్త కన్నప్ప వంతెనపై ప్రత్యర్థులు కిరాతకంగా దాడి చేశారు. రెండు చేతులు విరిగిపోవడంతో పాటు జననాంగాల పైన దాడి జరగడంతో ఇమ్రాన్ ఖాన్ తీవ్రంగా గాయపడ్డారు.

చికిత్స నిమిత్తం తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. వంతెన సమీపంలో అమర్చిన సీసీ పుటేజీల్లో దాడి దృశ్యాలు నిక్షిప్తమయ్యాయి. ఇమ్రాన్ ఖాన్​పై పలు కేసులు ఉండడంతో పాత దాడికి పాత కక్షలే కారణమని పోలీసులు భావిస్తున్నారు. కేసు నమోదు చేసుకుని విచారిస్తున్నారు.

ఇదీ చదవండి: BANK ROBBERY: గచ్చిబౌలి సెంట్రల్​ బ్యాంకు దోపిడీ కేసును ఛేదించిన పోలీసులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.