ఓయో రూమ్‌కు తీసుకెళ్లి.. మత్తు మందు ఇచ్చి.. బాలికపై గ్యాంగ్ రేప్‌

author img

By

Published : Sep 15, 2022, 8:57 AM IST

Updated : Sep 15, 2022, 1:36 PM IST

minor girl gang rape

08:52 September 15

Gang rape in Old city

Gang rape in Old city: జూబ్లీహిల్స్​ గ్యాంగ్ రేప్ తరహాలోనే... యువకులు మైనర్ బాలికను కారులో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడిన ఘటన హైదరాబాద్​లో వెలుగులోకి వచ్చింది. 16 ఏళ్ల బాలికపై యువకులు సామూహిక అత్యాచారం చేసిన ఘటన హైదరాబాద్​లోని పాతబస్తీలో జరిగింది. ఆ మైనర్​ను రెండు రోజులు పాటు ఓయో లాడ్జిలో ఉంచారు. ఆపై యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మొదట ఆమెను కిడ్నాప్ చేసి... హైదరాబాద్‌లోని రెండు హోటళ్లకు బాలికను మార్చుతూ.. ఆపై ఆమెపై నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. మొదట సుజన్ స్టే ఇన్ హోటల్​కు... తర్వాత త్రీక్యాసిల్ హోటల్‌కు ఆమెను నిందితులు తీసుకెళ్లారు. ఆ తరవాత ఓయో రూమ్‌కు తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి.. అత్యాచారానికి ఒడిగట్టారు. తరువాత ఆ యువకులు బాలికను లాడ్జిలోనే వదిలి వెళ్లారు.

ఈ నెల 12వ తేదీన రాత్రి 8 గంటల సమయంలో మందుల కోసమని బాలికను మెడికల్ షాప్​కు పంపినట్లు ఆమె తల్లి తెలిపింది. తర్వాత ఆమె తిరిగి రాలేదని, భయంతో పలు చోట్ల వెతికిన ఆచూకీ దొరకలేదని ఆమె వెల్లడించింది. తమ కుమార్తె కనిపించలేదని 13వ తేదీన డబీర్​పురా పోలీస్​స్టేషన్​లో ఫిర్యాదు చేశారు. వారు ఇచ్చిన ఫిర్యాదుతో అదృశ్యకేసుగా నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రంగంలోకి దిగిన పోలీసులు... ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరు యువకులు బాలికకు తెలిసినవారే. వారిని రీన్​​ బజార్​కు చెందిన సయ్యద్ రావిన్ష్, రియాసత్ అహ్మద్‌లుగా పోలీసులు గుర్తించి, అక్కడే అరెస్ట్​ చేశారు. నిందితులపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితులను రిమాండ్‌కు పంపనున్నట్లు పోలీసులు తెలిపారు.

గత రాత్రి బాలిక తల్లికి ఫోన్ చేసిన నిందితులు... మీ కుమార్తె మా వద్దనే ఉందని చెప్పినట్లు పోలీసులు తెలిపారు. ఆ ఫోన్ నంబర్ ను బాలిక తల్లి పోలీసులకు ఇవ్వడంతో నింతులను రీన్ బజార్ లో పట్టుకున్నారు. ప్రస్తుతం బాలిక నడవలేని స్థితిలో ఉందని, చేతికి ఇంజెక్షన్లు గుచ్చిన ఆనవాళ్లు ఉన్నాయని తెలుస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated :Sep 15, 2022, 1:36 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.