MAOISTS: మావోయిస్టుల కలకలం.. మందుపాతర పేల్చి వార్నింగ్​.!

author img

By

Published : Sep 6, 2021, 2:20 PM IST

maoists in bhadradri district

తెలంగాణ- ఛత్తీస్​గఢ్​ సరిహద్దుల్లో మావోయిస్టులు కలకలం రేపుతున్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా లెనిన్​ కాలనీలో మందుపాతర పేల్చారు. ఘటనలో ఓవ్యక్తికి గాయాలయ్యాయి.

తెలంగాణ- ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దు ప్రాంతంలో మావోయిస్టులు తమ ఉనికి చాటుకునేందుకు చర్యలు ప్రారంభించారు. తాజాగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం లెనిన్ కాలనీలో మావోయిస్టులు మందుపాతర పేల్చారు. అదే సమయంలో ద్విచక్రవాహనంపై అటుగా వెళ్తున్న ఓ వ్యక్తికి గాయాలయ్యాయి. బైక్​తో సహా అతను ఎగిరి కింద పడ్డాడు.

maoists in bhadradri district
గోడ పత్రం

గమనించిన స్థానికులు హుటాహుటిన క్షతగాత్రుడిని ఆస్పత్రికి తరలించారు. పేలుడుకు పాల్పడిన ప్రాంతంలో మావోయిస్టులు గోడ పత్రాలు వదిలి వెళ్లారు. చర్ల శబరి ఏరియా కమిటీ పేరుతో ఈ పత్రాలు ఉన్నాయి. జైళ్లలో ఉన్న రాజకీయ ఖైదీలను వెంటనే విడిచిపెట్టాలని మావోయిస్టులు డిమాండ్ చేశారు.

maoists in bhadradi district
మావోయిస్టులు పెట్టిన గోడ పత్రాలు

ఇదీ చదవండి: హైదరాబాద్​లో విలాసా సౌకర్యాల పేరుతో మోసం... కంట్రీ క్లబ్‌కు జరిమానా

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.