మున్సిపల్​ అధికారులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నం

author img

By

Published : Aug 6, 2021, 11:24 PM IST

మున్సిపల్​ అధికారులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నం

తమ భూమిని ప్రభుత్వ భూమంటూ మున్సిపల్​ అధికారులు వేధిస్తున్నారని ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. ఈ ఘటన మహబూబాబాద్​ జిల్లా కేంద్రంలో చోటుచేసుకుంది.

పట్టా భూమిలో గ్రీన్ ల్యాండ్ బోర్డును ఏర్పాటు చేసి మున్సిపల్ అధికారులు తమ భూమిని లాక్కోవడానికి ప్రయత్నం చేస్తున్నారని ఆరోపిస్తూ ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నం చేశాడు. మున్సిపల్ కార్యాలయం ఆవరణలోనే ఒంటిపై కిరోసిన్ పోసుకున్నాడు.

మున్సిపల్​ అధికారులు వేధిస్తున్నారంటూ ఆత్మహత్యాయత్నం

మహబూబాబాద్ మున్సిపాలిటీ 17వ వార్డులో తోట భిక్షపతి కుటుంబసభ్యులు జీవనం సాగిస్తున్నారు. అయితే వీరికి సంబంధించిన భూమిలో మున్సిపల్ అధికారులు గ్రీన్​ ల్యాండ్​ బోర్డును ఏర్పాటు చేశారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే తమ భూమిలో బోర్డు ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ తోట భిక్షపతి కుటుంబసభ్యులు మున్సిపల్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. భిక్షపతి తన ఒంటిపై కిరోసిన్​ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. తమ భూమిలో ప్రభుత్వ స్థలం అంటూ బోర్డు ఏర్పాటు చేసి వేధిస్తున్నారని.. తమకు న్యాయం చేయాలని బాధితుడు ప్రభుత్వాన్ని వేడుకున్నాడు.

మాది హౌసింగ్​ బోర్డు కాలనీ. 17వ వార్డులో నివాసం ఉంటాం. మాకు 166,167,168/2 సర్వే నెంబర్​లో 32 గుంటల భూమి ఉంది. అయితే మున్సిపల్​ ఛైర్మన్​, కమిషనర్​ మారినప్పుడల్లా ఈ భూమిలో గ్రీన్​ ల్యాండ్​ ఉందని హద్దులు పెడుతున్నారు. మాకు పట్టా ఉంది. పాసు పుస్తకం ఉంది. అయినా వినకుండా అధికారులు మమ్మల్ని వేధిస్తున్నారు.- తోట భిక్షపతి, బాధితుడు

ఇదీ చూడండి: ట్రాన్స్​ఫార్మర్ పేలి మహిళ దుర్మరణం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.