పురుగులమందు తాగి అడవిలో ప్రేమజంట బలవన్మరణం

author img

By

Published : May 9, 2022, 9:50 PM IST

Updated : May 9, 2022, 10:24 PM IST

పురుగులమందు తాగి అడవిలో ప్రేమజంట బలవన్మరణం

21:47 May 09

పురుగులమందు తాగి అడవిలో ప్రేమజంట బలవన్మరణం

Lovers Suicide: ఇద్దరూ ప్రాణానికి ప్రాణంగా ప్రేమించుకున్నారు. కలిసి బతకాలని ఎన్నో కలలు కన్నారు. కలిసి ఉంటే ఎంత సంతోషంగా గడుపుతామో అంటూ ఊసులు చెప్పుకున్నారు. ఒకే ఊళ్లో పుట్టిన ఆ జంట ఒకరినొకరు ఇష్టపడ్డారు. వారి ప్రేమను మరో మెట్టు ఎక్కించడానికి పెళ్లికి సిద్ధమయ్యారు. కానీ ఏం జరిగిందో ఏమో... చివరికి ఇద్దరు ఆత్మహత్య చేసుకుని తనువు చాలించారు.

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ముల్కలపల్లి శివారు అడవిలో ప్రేమజంట బలవన్మరణానికి పాల్పడింది. పురుగులమందు తాగి మడకం సోనా(25), దేవి(25) ఆత్మహత్య చేసుకున్నారు. దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమివ్వగా.. ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. నాలుగురోజుల క్రితమే ప్రేమజంట ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు గుర్తించారు. వారి ఆత్మహత్యకు గల కారణాలపై విచారిస్తున్నారు.

ఇవీ చదవండి:

Last Updated :May 9, 2022, 10:24 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.