కారు టైరు పేలి ప్రమాదం.. మాజీ ఎంపీపీ మృతి..

author img

By

Published : Apr 20, 2022, 9:31 PM IST

kurnool-ex-mpp-died-in-road-accident

రాష్ట్రంలోని గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు వద్ద చోటు చేసుకున్న రోడ్డు ప్రమాదంలో ఏపీలోని కర్నూలు మాజీ ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి మృతి చెందాడు. కారు టైరు పేలటంతో ఈ ప్రమాదం జరిగింది.

ఏపీకి చెందిన తెదేపా సీనియర్​ నేత విష్ణువర్ధన్‌రెడ్డి కుమారుడు, కర్నూలు మాజీ ఎంపీపీ రాజవర్ధన్ రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. రాజవర్ధన్ రెడ్డి ప్రయాణిస్తున్న కారు.. తెలంగాణలోని గద్వాల జిల్లా ఇటిక్యాలపాడు వద్దకు చేరుకోగానే.. టైరు పేలి ఈ ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు ఆయన్ను ఆసుపత్రికి తరలించగా.. చికిత్స పొందుతూ మృతి చెందారు.

రాజవర్థన్‌రెడ్డి మృతిపై తెదేపా అధినేత చంద్రబాబు, లోకేశ్‌ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. రాజవర్థన్‌రెడ్డి కుటుంబసభ్యులకు సానుభూతి తెలిపారు.

ఇదీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.