Suspected Death: విద్యార్థిని అనుమానాస్పద మృతి.. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత

author img

By

Published : Jul 17, 2022, 4:06 PM IST

Suspected Death

Suspected death: కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట్​లో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో ఘర్షణకు దారితీసింది. విద్యార్థిని చావుకు ఓ యువకుడు కారణమంటూ గ్రామస్థులు దాడి చేసేందుకు యత్నించారు.

Suspected death: ఇంటర్ విద్యార్థిని అనుమానాస్పదస్థితిలో మృతి చెందడంతో తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. విద్యార్థిని మృతికి ఓ యువకుడు కారణమని ఆరోపిస్తూ బంధువులు, గ్రామస్థులు దాడి చేసేందుకు యత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు గ్రామస్థులను అడ్డుకున్నారు. దీంతో గ్రామస్థులకు, పోలీసులకు మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా దోమకొండ మండలం ముత్యంపేట్​లో జరిగింది.

ముత్యంపేట్​కు చెందిన సగ్గిడి మేఘమాల(17) ఇంటి నుంచి కనిపించకుండా పోయి.. తెల్లారేసరికి గ్రామ సమీపంలోని పరికికుంట చెరువులో శవమై కనిపించింది. మృతురాలి తండ్రి గల్ఫ్​లో ఉండగా ఈరోజు గ్రామానికి చేరుకున్నాడు. అయితే గ్రామానికే చెందిన యువకుడే చంపి చెరువులో పడేసి ఉంటాడని ఆరోపిస్తూ అతనిపై దాడి చేసేందుకు వెళ్లారు. విషయం తెలుసుకున్న పోలీసులు గ్రామానికి వచ్చి యువకుడిని స్టేషన్​కు తరలించే ప్రయత్నం చేయగా గ్రామస్థులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గ్రామస్థులకు, పోలీసులకు మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. అనుమానిత యువకుడ్ని పీఎస్​కు తరలించిన పోలీసులు గ్రామంలో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు.

విద్యార్థిని అనుమానాస్పద మృతి.. గ్రామంలో తీవ్ర ఉద్రిక్తత

ఇవీ చదవండి: ‘నా భర్తను చంపేయ్‌.. సంతోషంగా ఉందాం

ఆ కేసు నుంచి ఈజీగా బయటపడతా.. జైలులో పోలీసు అధికారి బిందాస్..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.