చెరువులో తల్లీకుమార్తె మృతదేహాలు.. హత్యా.. ఆత్మహత్యా?

author img

By

Published : Sep 25, 2021, 8:52 AM IST

Updated : Sep 25, 2021, 9:27 AM IST

suicide or murder

08:49 September 25

తల్లి, రెండేళ్ల చిన్నారి మృతదేహాలు గుర్తించిన గ్రామస్థులు

నారాయణపేట జిల్లాలోని ఊట్కూరు మండలం తిమ్మారెడ్డిపల్లి తండాలో విషాదం చోటు చేసుకుంది. తిమ్మారెడ్డిపల్లి తండా చెరువులో రెండు మృతదేహాల (dead bodies found in pond )ను గ్రామస్థులు చూశారు. మృతులు తల్లి, రెండేళ్ల చిన్నారిగా గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. 

ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. కుటుంబ తగాదాలతో  ఆత్మహత్య చేసుకున్నారా? లేదా ఎవరైనా హత్య చేసి ఇక్కడ పడేశారా అనే కోణంలో విచారణ చేస్తున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించినట్లు పోలీసులు వెల్లడించారు.

Last Updated :Sep 25, 2021, 9:27 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.