pending challans vehicle seize: పోలీసులే షాక్​... ఒకే బైక్‌పై 107 చలాన్లు.. పెండింగ్​ ఎంతంటే?

author img

By

Published : Nov 14, 2021, 3:48 PM IST

107 challans pending vehicle seize

హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల వాహనాల తనిఖీల్లో 107 చలాన్లు పెండింగ్ ఉన్న వాహనం(107 challans pending vehicle seized) పట్టుబడింది. వాహనంపై చలాన్ల మొత్తం రూ.35,835 ఉండటంతో పోలీసులు అవాక్కయ్యారు. వెంటనే హోండా యాక్టివాను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు.

నాలుగేళ్లుగా ట్రాఫిక్‌ నిబంధనలు ఉల్లంఘించిన ఘటనలో 107 చలాన్లు ఉన్న ఓ ద్విచక్ర వాహనదారుడు(107 challans pending vehicle seized) ఎట్టకేలకు హైదరాబాద్ ​ట్రాఫిక్ పోలీసులకు చిక్కాడు. జూబ్లీహిల్స్‌లో వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ యాక్టివాను పోలీసులు నిలిపి పరిశీలించారు. నాలుగేళ్లుగా 107 చలాన్లకు గాను మొత్తం రూ.35,835 పెండింగ్‌లో ఉన్నట్లు తేలింది.

ఇంకేముంది... అవాక్కవ్వడం పోలీసుల వంతైంది. అబిడ్స్‌ సిటీ గూగుల్‌ భవనంలో స్కేటింగ్‌ కోచ్‌గా పనిచేస్తున్న జునైద్ టీఎస్‌ 09ఎఫ్‌ 3792 నెంబర్ గల హోండా యాక్టివాను వెంటనే పోలీసులు సీజ్‌(traffic police seized 107 challans pending vehicle )చేశారు. నాలుగేళ్లుగా ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తుండటంతో అతనిపై కేసు నమోదు చేశారు.

ఇటీవల కాలంలో పోలీసులు పెండింగ్ చలాన్లపై ప్రత్యేక దృష్టిసారించారు. కూడళ్లలో వచ్చే పోయే ప్రతీ వాహనాన్ని పరిశీలిస్తున్నారు. అనుమానం ఉంటే వెంటనే ఆపి చలానాలు తనిఖీ చేస్తున్నారు. వీలైనంత వరకు అక్కడికక్కడే చలానా వసూలు చేస్తున్నారు. వేయి రూపాయల కంటే ఎక్కువ బాకీ ఉంటే వాహనదారులు ఖచ్చితంగా మీ-సేవలో కానీ, ఆన్​లైన్లో కానీ పేమెంట్ చేసినట్లుగా చూపిన తరువాతే వాహనం అప్పగిస్తున్నారు.

ప్రమాదం వెన్నంటే..

కొద్దిరోజులుగా ట్రాఫిక్‌ పోలీసులు బైకులు, కార్లు, ఇతర వాహనదారులపై నిఘా పెట్టారు. సెల్‌ఫోన్‌లో మాట్లాడుతూ వెళ్లే వారి డ్రైవింగ్‌ను, ఫోన్‌లో మాట్లాడకుండా వెళ్తున్నవారి డ్రైవింగ్‌ను పరిశీలించారు. ప్రమాదాలకు కారణమవుతున్న కొన్ని అంశాలను గమనించారు.

  • నగరంలోని 85 ప్రధాన కూడళ్ల వద్ద కమాండ్‌ కంట్రోల్‌ కేంద్రం నుంచి పరిశీలించారు. ద్విచక్రవాహనదారుల్లో 70 శాతం మంది ఫోన్‌లో మాట్లాడుతున్నారని తెలుసుకున్నారు.
  • ఈ ఉల్లంఘనులు ఎక్కువ ఖైరతాబాద్‌, ఆబిడ్స్‌, కోఠి, మలక్‌పేట, జూబ్లీహిల్స్‌, ఎస్సార్‌నగర్‌, పంజాగుట్ట ట్రాఫిక్‌ ఠాణాల పరిధుల్లోనే కనిపిస్తున్నారని గుర్తించారు.
  • వాహనం నడిపేప్పుడు ఫోన్‌ మోగగానే..బైక్‌, స్కూటీలపై వెళ్తున్నవారు వెనక, ముందూ ఆలోచించకుండా ఎత్తుతున్నారు. వాహనవేగం తగ్గి, వెనక వచ్చే వారు ఢీకొంటున్నారు. మరికొందరు ఒకచేత్తోనే వాహన వేగాన్ని నియంత్రిస్తున్నారు. మరికొందరు సరిగా వినిపించకపోవడంతో ఫోన్‌ దగ్గరగా పట్టుకొనే ప్రయత్నంలో యాక్సిలేటర్‌ గట్టిగా లాగుతున్నారు. ముందు వాహనాలను ఢీకొంటున్నారు.

ఏడాది జైలు.. రూ.5 వేల జరిమానా

ఇకపై కేంద్ర మోటార్‌ వాహన సవరణ చట్టాన్ని ఉల్లంఘనులపై ప్రయోగించాలనుకుంటున్నారు ట్రాఫిక్‌ పోలీసులు. చరవాణిలో మాట్లాడుతూ వెళ్తున్న వారిపై కేసు నమోదు చేయనున్నారు. కోర్టు వీరికి రూ.5 వేలు జరిమానాతో పాటు ఏడాదిపాటు జైలుశిక్ష విధించనుంది. వాహనాలను నడుపుతున్నప్పుడు సెల్‌ఫోన్లను కేవలం గమ్యస్థానాలకు దారి చూపేందుకు మాత్రమే వినియోగించాలంటూ కేంద్ర రవాణా శాఖ అన్ని రాష్ట్రాలను ఆదేశించడంతో ట్రాఫిక్‌ పోలీసులు జైలు, జరిమానా అంశంపై దృష్టి కేంద్రీకరించనున్నారు.

ఇదీ చదవండి: Harassment at school: బాలికలపై జిల్లా అధికారి వేధింపులు.. చంపేస్తానంటూ బెదిరింపులు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.