రాచకొండలో డ్రగ్స్ కలకలం.. ఇద్దరు ఫారినర్స్ సహా నలుగురి అరెస్ట్

author img

By

Published : Feb 14, 2023, 3:18 PM IST

Updated : Feb 14, 2023, 9:43 PM IST

Drugs

15:15 February 14

అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాను పట్టుకున్న రాచకొండ​ పోలీసులు

రాచకొండలో డ్రగ్స్ కలకలం.. ఇద్దరు ఫారినర్స్ సహా నలుగురి అరెస్ట్

International drug gang arrested: హైదరాబాద్‌ విమానాశ్రయం నుంచి ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ దేశాలకు సూడో ఎఫిడ్రిన్‌ మాదకద్రవ్యాన్ని రవాణా చేస్తున్న అంతర్జాతీయ డ్రగ్స్‌ ముఠాలోని మరో ఇద్దరు మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులకు చిక్కారు. గాజుల బాక్సులు, బ్రాండెడ్‌ దుస్తుల పెట్టెల లోపలి భాగంలో సూడో ఎఫిడ్రిన్‌ దాచి.. కొరియర్‌ ఏజెన్సీల ద్వారా పంపిస్తున్నారు. గతేడాది డిసెంబరులో రాచకొండలో భారీమొత్తంలో సూడోఎఫిడ్రిన్‌ పట్టుబడిన కేసులో వీరిద్దరూ నిందితులు.

అప్పుడు రసూలుద్దీన్‌, మహ్మద్‌ కాశీంలు ఇద్దరు అరెస్ట్ కావడంతో గత కొన్ని రోజులుగా దందా ఆపేసిన నిందితులు ఫిబ్రవరిలో మళ్లీ డ్రగ్స్‌ రవాణా మొదలుపెట్టారు. ఈ క్రమంలో ఆస్ట్రేలియాకు సరుకు పంపేందుకు సిద్ధమవుతుండగా మాటువేసిన పోలీసులు ఇద్దరిని అరెస్ట్ చేశారు. షేక్‌ ఫరీద్‌ మహ్మద్‌ అలీ, ఫైజారుణ్‌ ముజాహిద్​లను అరెస్ట్ చేసిన వీరి నుంచి రూ.55 లక్షల విలువైన 500 గ్రాముల సూడో ఎఫిడ్రిన్, 80 గ్రాముల బంగారం, పాస్‌పోర్టు, రెండు ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఇప్పటి వరకూ ఈ కేసులో నలుగురు నిందితులు అరెస్టు చేయగా.. కీలక డ్రగ్‌ డాన్‌ రహీమ్‌ షా పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు.

"ముజాహిద్‌ మహారాష్ట్రలోని పుణెకు చెందిన షేక్‌ ఫరీద్‌ మహ్మద్‌ అలీ, ఫైజారుణ్‌ ముజాహిద్‌ ఇద్దరూ ప్రాణ స్నేహితులు. చెన్నైలో నివాసం ఉంటున్న తన సోదరిని కలిసేందుకు తరచూ వెళ్లే షేక్‌ ఫరీద్‌ అక్కడే స్మగ్లింగ్‌ దందాలో అడుగుపెట్టాడు. తన బావ బషీర్‌ అహ్మద్‌తో కలిసి మలేషియాకు వెళ్లి ఎలక్ట్రానిక్‌ సిగరెట్లు, స్మార్ట్‌ వాచీలు, సెల్‌ఫోన్లు, కెమెరాలు, గృహోపకరణాలు కొనుగోలు చేసి దొడ్డిదారిలో చెన్నైకి తీసుకొస్తారు.

Drug gang arrested: స్థానికంగా రెట్టింపు ధరకు అమ్ముతారు. లాభసాటిగా ఉండడంతో ఫరీద్‌ తన స్నేహితడైన ఫైజన్‌ను కూడా ఈ దందాలోకి దింపాడు. ఇదే క్రమంలో ఫరీద్, ఫైజన్‌లకు డ్రగ్స్‌ రవాణాలో ఆరితేరిన చెన్నైకి చెందిన రసూలుద్దీన్‌ పరిచయమయ్యాడు. రసూల్‌ వారికి లాభాల ఆశ చూపించి డ్రగ్స్‌ రవాణాలోకి దించాడు. కొన్ని రోజుల తరువాత మహ్మద్‌ కాశీం కూడా వీరికి తోడయ్యాడు. రసూల్, ఫరీద్, ఫైజన్, కాశీం చెన్నైలోని ట్రిప్లికేన్‌కు చెందిన డ్రగ్‌ డాన్‌ రహీమ్‌ షా ఆదేశాలతో పనిచేసేవారు. కమీషన్ల లెక్కన తీసుకుని పుణె, హైదరాబాద్‌ విమానాశ్రయాల ద్వారా ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు సూడో ఎఫిడ్రిన్‌ తరలించేవారు.

సాధారణంగా విమానాశ్రయాల్లో కస్టమ్‌ అధికారుల తనిఖీలు, యంత్రాల స్కానింగ్‌లో అన్ని రకాల డ్రగ్స్‌ పట్టుబడతాయి. పౌడర్‌ రూపంలో ఉండే సూడోఎఫిడ్రిన్‌ మాత్రం స్కానర్​కు చిక్కదు. దీన్ని అదనుగా చేసుకున్న నిందితులు తరచూ రవాణా చేస్తున్నారు. మొదట బస్సులు, రైళ్ళు, రోడ్డు మార్గాల్లో వెళ్లి అక్కడ నుంచి కొరియర్‌ సంస్థల ద్వారా ఈ డ్రగ్​ను పంపిస్తారు. నలుగురు నిందితులు కలిసి పుణె విమానాశ్రయం మీదుగా డిసెంబరు వరకూ 15 సార్లు రూ.వందల కోట్ల విలువైన సూడో ఎఫిడ్రిన్‌ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌ తరలించారు. చెన్నైలో ఉండే రహీమ్‌.. సరకు ఎక్కడ ఉంది..? ఎక్కడకు పంపాలో చెబుతాడు. రవాణా ఛార్జీలు, చిరునామాలు అతనే ఇస్తాడు. నలుగురూ కలిసి కమీషన్ల చొప్పున తీసుకుని కొరియర్ల ద్వారా సరకు పంపిస్తారని" పోలీసులు వెల్లడించారు.

Drugs in Hyderabad: దీనిపై సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ పోలీసులు గతేడాది డిసెంబరు 11న కాశీం, రసూలుద్దీన్‌ను హైదరాబాద్‌లో అరెస్టు చేసి రూ.9 కోట్ల విలువైన 8.5 కిలోల సూడోఎఫిడ్రిన్‌ స్వాధీనం చేసుకున్నారు. దీంతో ఫరీద్, ఫైజన్‌ ఇద్దరూ ఫోన్లు ఆఫ్‌ చేసి పరారయ్యారు. నాచారం పోలీసులు కాశీం, రసూలుద్దీన్‌ను కస్టడీకి తీసుకుని విచారించి కొన్ని వివరాలు రాబట్టారు. వారిచ్చిన సమాచారం మేరకు ఫరీద్, ఫైజన్​లను అరెస్ట్ చేశారు.

హైదరాబాద్‌లో సహచరుల అరెస్టుతో పరారైన ఇద్దరూ ఫిబ్రవరి తొలివారం నుంచి మళ్లీ దందా మొదలుపెట్టారు. ఈనెల రెండో వారంలో హైదరాబాద్‌లోని శంషాబాద్‌ విమానాశ్రయం నుంచి నాలుగు సార్లు సూడో ఎఫిడ్రిన్‌ను ఆస్ట్రేలియా, న్యూజిలాండ్‌కు పంపించారు. మరోసారి సూడోఎఫిడ్రిన్‌ పంపేందుకు నాలుగు రోజుల క్రితం నిందితులు హైదరాబాద్‌ వచ్చారు. ఈ సమాచారం అందుకున్న మల్కాజ్‌గిరి ఎస్‌వోటీ ఇన్‌స్పెక్టర్‌ రాములు బృందం నిందితుల్ని అదుపులోకి తీసుకుంది.

"సింథటిక్​ డ్రగ్​ను ఇవాళ పట్టుకోవడం జరిగింది. దాని పేరు సూడోపెడ్రిన్ డ్రగ్స్‌.. మొత్తం 500 గ్రాముల డ్రగ్స్​ను స్వాధీనం చేసుకోవడం జరిగింది. దాని​ విలువ 50 లక్షల ఉంటుందని అంచనా.. ఇందులో మొత్తం ఇద్దరు విదేశీయులు సహా నలుగురిని అరెస్టు చేశాం. వీరు మలేషియా, అస్టేలియా వైపు నుంచి డ్రగ్స్​ను వేరే వాళ్ల సామన్లలలో పెట్టి.. అంటే ఆ యాజమానులకు తెలియకుండనే వారి వస్తువుల్లో పెట్టి రవాణా చేస్తుంటారు"- డీఎస్​ చౌహాన్​, రాచకొండ సీపీ

ఇవీ చదవండి:

విద్యార్థులు డ్రగ్స్​కు దూరంగా ఉండాలి: సాయి ధరమ్​ తేజ్

డ్రగ్స్​ కేసులో కీలక నిందితులు అరెస్టు.. కొకైన్​ స్వాధీనం

అక్రమంగా తరలిస్తున్న రూ.5 కోట్ల డ్రగ్స్​ను పట్టించిన శునకం

'LTTE ప్రభాకరన్ బతికే ఉన్నారు.. వారి కోసం త్వరలోనే వస్తారు!'.. నిజం కాదన్న శ్రీలంక

Last Updated :Feb 14, 2023, 9:43 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.