తాగి చస్తావా...? అన్నందుకు భార్యనే చంపిన భర్త.. ఆపై సూసైడ్​గా చిత్రీకరించి..

author img

By

Published : Sep 15, 2022, 12:20 PM IST

murder

Wife murder: ఈరోజుల్లో సినిమాల ప్రభావం జనాల్లో ఎంతలా ఉందంటే కొన్ని హత్యలు చేసే తీరును చూసి చెప్పవచ్చు.. చిన్నా, పెద్ద తేడా లేకుండా అందరూ ఆ సినిమాలలో చూపించే దృశ్యాల మాదిరిగా చేస్తున్నారు. కొన్నిసార్లు అవి సమాజానికి ఉపయోగపడే విధంగా ఉంటున్నాయి. మరికొన్ని వారి బతుకులను కటకటాల పాలు చేసే విధంగా ఉపయోగపడుతున్నాయి. ఇప్పుడు అదే సినిమా తరహాలోనే హత్య జరిగింది.

Wife murder: జీవితాంతం తోడుగా ఉండాల్సిన భర్త... ఆమె పాలిట యముడయ్యాడు. తాగొద్దు అన్నందుకు కట్టుకున్న భార్యనే చంపి ఆత్మహత్యగా చిత్రీకరించాడు. ఈ ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు మండలం చిట్కుల్ గ్రామంలో చోటుచేసుకుంది. ఇంటిలో దొంగను ఈశ్వరుడైనా పట్టుకోలేరు అనుకుంటారు కానీ అది పాత రోజుల సామెత. ఇప్పుడు ఎటువంటి ఘటనలు జరిగినా వెంటనే పట్టుకుంటున్నారు పోలీసులు. ఇప్పుడు ఈ హత్య కేసును సైతం పోలీసులు ఛేదించారు. పోలీసుల వివరాల ప్రకారం.. ప్రకాశం జిల్లా వాలేటివారిపాలెం మండలం పోకురు గ్రామానికి చెందిన ప్రవీణ్, భార్య ప్రియాంకతో కలిసి బతుకుతెరువుకోసం సంగారెడ్డి జిల్లా పటాన్​ చెరు మండలం చిట్కుల్ గ్రామానికి వచ్చి మేస్త్రిగా పని చేసుకుంటూ జీవిస్తున్నాడు.

ప్రవీణ్ విపరీతంగా మద్యం తాగడంతో భార్య ప్రియాంక అతనితో గొడవపడేది. ఈ నేపథ్యంలోనే భార్య భర్తల మధ్య తరచూ గొడవలు అయ్యేవి. గతంలోనూ వీరిద్దరికి గొడవలు జరగడంతో స్వగ్రామంలో పెద్దలు పంచాయితీ పెట్టి సర్దిచెప్పారు. ఇప్పుడు వలస వచ్చిన చిట్కుల్ గ్రామంలో సైతం ఇదే మాదిరిగా గొడవలు జరిగేవి. తాను మద్యం తాగేందుకు అడ్డువస్తుందని భావించి ఆమెపై పన్నాగం పన్ని ఈనెల 12వ తేదీన ఉదయం గొంతు నులిమి హత్యచేశాడు.

మృతురాలి సోదరుడు హరికృష్ణ ఫిర్యాదుతో పోలీసులకు అనుమానం వచ్చి పోస్టుమార్టం చేయించగా గొంతు నులిమి హత్యచేసినట్లు నివేదికలో తేలింది. దీంతో నిందితుడు ప్రవీణ్​ను అదుపులోకి తీసుకుని తమదైన శైలిలో విచారించగా భార్యను గొంతునులిమి హత్యచేశానని తెలిపాడు. అంతేకాక ఆమె మెడకు చీరచుట్టి... ఉరివేసుకుందని నమ్మించే ప్రయత్నం చేసినట్లు విచారణలో తేలింది. నిందితుడు ప్రవీణ్​ను అరెస్టు చేసి రిమాండ్​కు తరలించారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.